Gang Rape: భర్తకు యాక్సిడెంటైందని చెప్పి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు

భర్తకు యాక్సిడెంటైందని చెప్పి తీసుకెళ్లి ఓ మహిళను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు ముగ్గురు దుర్మార్గులు.

Gang Rape: భర్తకు యాక్సిడెంటైందని చెప్పి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు

Gang Rape

Gang Rape: భర్తకు యాక్సిడెంటైందని చెప్పి తీసుకెళ్లి ఓ మహిళను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు ముగ్గురు దుర్మార్గులు. ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ జిల్లాలోని అకల్తారా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకల్తారా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిరారి సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు పాల్పడిన చంద్రమణి వైష్ణవ్, సురేంద్ర శ్రీవాస్, శివదాస్ మహంత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై అత్యాచారం, హత్యతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఊర్మిళా పట్లే(25) అనే మహిళ తన భర్త నాగేంద్ర పాట్లేతో కలిసి ఓ లేబర్ కాలనీలో నివాసం ఉండేవారు.

ఊర్మిళ పట్లే మూడు రోజులు క్రితం ఇంట్లో కనిపించకుండా పోయింది. దీంతో భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు విచారణలో భాగంగా ఆమెను వైష్ణవ్ అనే వ్యక్తి బైక్‌పై తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. వైష్ణవ్‌ని పట్టుకుని కూపీ లాగగా.. నిజం వెలుగులోకి వచ్చింది.

ఊర్మిళపై అత్యాచారం చేసి, విషయం బయటకు చెబుతుందనే కారణంతో బాధితురాలిని హత్య చేసినట్లు గుర్తించారు. మహిళ ముఖం గుర్తు పట్టలేనంతగా చిద్రం చేశారు. శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నట్లు పోస్టు మార్టం రిపోర్టులో వెల్లడైంది. మహిళను గొంతు కోసి, రాయితో కొట్టి చంపినట్లుగా పోలీసులు చెప్పారు. తర్వాత సంచిలోమృతదేహాన్ని పెట్టి కాలువలో పడేశారు.