Road Accident : డీసీఎంను ఢీకొన్న బైక్, ముగ్గురు మృతి
చౌటుప్పల్ మండలం ఆరేగూడెం పంతంగి టోల్ ప్లాజా వద్ద డీసీఎంను ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Three people killed in road accident : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చౌటుప్పల్ మండలం ఆరేగూడెం పంతంగి టోల్ ప్లాజా వద్ద డీసీఎంను ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు. మృతులు చౌటుప్పల్ మండలం లక్కారం వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
Minister KTR : తెలంగాణలో నేతన్నలను పట్టించుకోని కేంద్రం : మంత్రి కేటీఆర్
సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సివుంది.