Dead body : రాజేంద్రనగర్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. బండ్లగూడ చౌరస్తా సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్ధానికులు కనుగొన్నారు.
Dead body : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. బండ్లగూడ చౌరస్తా సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్ధానికులు కనుగొన్నారు. సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరీశిలించారు. ప్రహరీ గోడ పక్కన మృతదేహాంపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.