Extra Marital Affair : ప్రియురాలు-ముగ్గురు ప్రియులు-మధ్యలో భర్త
పెళ్లైనా, భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోంది ఒక మహిళ. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భర్తతో సుఖం లేదనుకుందో, లేక తన అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నాడనుకుందో ఏమో తన ముగ్గు
Extra Marital Affair : పెళ్లైనా, భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోంది ఒక మహిళ. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భర్తతో సుఖం లేదనుకుందో, లేక తన అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నాడనుకుందో ఏమో తన ముగ్గురు ప్రియులతో కలిసి భర్తను హతమార్చింది .
వివరాల్లోకి వెళితే… మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన చెరువుమీది పర్వతాలు (27)కు ఉదండాపూర్ లోని యాదమ్మతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. యాదమ్మ భర్తకు తెలియకుండా పలువురితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ ఉండేది.
ఒకానోక దురదృష్టకర సమయంలో జరిగిన ప్రమాదంలో పర్వతాలుకు రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో అప్పటి నుంచి పర్వతాలు ఇంటికే పరిమితం అయ్యాడు. దీంతో యాదమ్మ వివాహేతర సంబంధాలు కొనసాగించటానికి భర్త అడ్డుగా ఉన్నాడు. ఇంట్లోనే ఉంటున్న భర్త భార్య ప్రతి కదలికను అనుమానించ సాగాడు.
తన వివాహేతర సంబంధాలకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన యాదమ్మ, భర్తను అడ్డు తొలగించు కునేందుకు తన ప్రియులతో కలిసి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22 తేదీ రాత్రి పర్వతాలుకు ఫుల్లుగా మద్యం తాగించారు. అపస్మారక స్ధితికి చేరుకున్న పర్వతాలు మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు.
Also Read :Lunar Eclipse 2021 : కార్తీక పౌర్ణమికి చంద్రగ్రహణం ఉందా? లేదా ?
ఏమీ తెలియనట్లు పడుకుని… తెల్లారి లేచాక లబోదిబో మంటూ ఏడవసాగింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించిన పోలీసులు భార్య యాదమ్మను కూడా విచారించారు.
ఆమె సెల్ ఫోన్ తీసుకుని అందులోని కాల్ లిస్ట్ ప్రకారం ఎంక్వయిరీ చేయటం మొదలెట్టారు. దీంతో ఆమె బాగోతం బయటపడింది. ఆమెతో పాటు పోలేపల్లికి చెందిన ఎన్నన్ గండ్ల శివలింగం, ఎన్నన్ గండ్ల మల్లెష్. గడ్డపు నాగరాజులను నిందితులుగా గుర్తించారు. 8 నెలల తర్వాత నలుగురు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు.