Tirupati : ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు (సంప్రదాయ కళంకారి కళ)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.
Tirupati : తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు (సంప్రదాయ కళంకారి కళ)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.
కళాశాలలో జూన్ 1 నుండి 10వ తేదీ వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 17వ తేదీ సాయంత్రం లోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది. డిప్లొమా కోర్సులో చేరిన విద్యార్థిని విద్యార్థులకు ఒక లక్ష రూపాయలు చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేసి ఉత్తీర్ణత సాధించిన అనంతరం నిబంధనలకు లోబడి చెల్లిస్తారు. కోర్సులు, విద్యార్హతలు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్సైట్ను గానీ, కళాశాల కార్యాలయాన్ని 0877-2264637 నంబరులో గానీ సంప్రదించవచ్చని టీటీడీ తెలిపింది.