’నా ప్రాణం తీసినా.. న్యాయం కోసమే పోరాడుతా’ : ప్రణయ్ తండ్రి

’మా బాబు పుట్టిన రోజే అమృతకు బాబు పుట్టాడు’ అని ప్రణయ్ తండ్రి తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 07:33 PM IST
’నా ప్రాణం తీసినా.. న్యాయం కోసమే పోరాడుతా’ : ప్రణయ్ తండ్రి

’మా బాబు పుట్టిన రోజే అమృతకు బాబు పుట్టాడు’ అని ప్రణయ్ తండ్రి తెలిపారు.

 హైదరాబాద్ : మిర్యాలగూడలో ప్రణయ్ దారుణ హత్య ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రణయ్ భార్య అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కుమార్తె.. వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించాడు. ఆ సమయంలో అమృత ఐదు నెలల గర్భిణి కాగా.. 2019, జనవరి 30వ తేదీన అమృత..ప్రణయ్‌ల పెళ్లి రోజునే అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ప్రణమ్ తండ్రి టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అమ్మాయికి ఆరోగ్యంగా డెలివరి కావాలని హైదరాబాద్ లో చేర్పించామని చెప్పారు.

’మా బాబు పుట్టిన రోజే అమృతకు బాబు పుట్టాడు’ అని ప్రణయ్ తండ్రి తెలిపారు. అమృత-ప్రణయ్ పెళ్లైన ఏడాదిగా చిత్రహింసలు భరించామని తెలిపారు. ’నా ప్రాణం తీసినా, న్యాయం కొరకే పోరాడుతాను’ అని అన్నారు. ప్రణయ్ హత్య జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు పోలీసుల రక్షణలో ఉన్నామని తెలిపారు. మీడియా, పోలీసుల రక్షణతోనే తమ కుటుంబ బ్రతుకుతోందన్నారు.