అర్థరాత్రి కూడా సర్వీసులు : గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం జరిగే సెప్టెంబర్ 12వ తేదీ గురువారం భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్ళు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్-హైదరాబాద్,
హైదరాబాద్-లింగంపల్లి,
లింగంపల్లి-హైదరాబాద్ మధ్య రెండేసి రైలు సర్వీసులు 12వ తేదీ అర్దరాత్రి నుంచి 13వ తేదీ తెల్లవారుజామున 4గంటల వరకు నడుస్తాయని అధికారులు వివరించారు.
హైదరాబాద్-సికింద్రాబాద్,
ఫలక్ నుమా-సికింద్రాబాద్
మధ్య ఒక్కో ప్రత్యేక సర్వీసు నడుస్తాయని తెలిపారు. రోజూ నడిచే 121 సర్వీసులకు అదనంగా ఈ సర్వీసులు నడపుతున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.