Three siblings: రైలు వస్తుందన్న భయంతో బ్రిడ్జి పైనుంచి దూకేసిన ముగ్గురు తోబుట్టువులు.. ఒకరి మృతి

 మోహియుద్దీన్ అనే 12 ఏళ్ల బాలుడు, అతడి ఇద్దరు చెల్లెళ్లు హదియా ఫాతిమా(11), అలియా (6) కలిసి ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తున్నారు. అందు కోసం రైల్వే బ్రిడ్జిపై ముగ్గురూ నడుస్తున్నారు. ఇంతలో తమ వైపుగా రైలు రావడాన్ని ఆ ముగ్గురు చిన్నారులు గమనించారు. భయంతో ఏం చేయాలో తెలియక మొహియుద్దీన్, ఫాతిమా, అలియా బ్రిడ్జి పై నుంచి కిందకు దూకేశారు. దీంతో ఫాతిమా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Three siblings: రైలు వస్తుందన్న భయంతో బ్రిడ్జి పైనుంచి దూకేసిన ముగ్గురు తోబుట్టువులు.. ఒకరి మృతి

Alabama shooting

Three siblings: మోహియుద్దీన్ అనే 12 ఏళ్ల బాలుడు, అతడి ఇద్దరు చెల్లెళ్లు హదియా ఫాతిమా(11), అలియా (6) కలిసి ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తున్నారు. అందు కోసం రైల్వే బ్రిడ్జిపై ముగ్గురూ నడుస్తున్నారు. ఇంతలో తమ వైపుగా రైలు రావడాన్ని ఆ ముగ్గురు చిన్నారులు గమనించారు. భయంతో ఏం చేయాలో తెలియక మొహియుద్దీన్, ఫాతిమా, అలియా బ్రిడ్జి పై నుంచి కిందకు దూకేశారు.

దీంతో ఫాతిమా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మొహియుద్దీన్, అలియాకు తీవ్రగాయాలయ్యాయి. వారిద్దరినీ పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫాతిమా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్ లోని బజాల్తా ప్రాంతంలో చోటుచేసుకుంది.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ముగ్గురు చిన్నారులు రైలు వస్తుందన్న భయంతోనే బ్రిడ్జి పై నుంచి దూకేసినట్లు తాము భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..