Muslim man donates land: హనుమంతుడికి గుడి కట్టడానికి తన భూమిని ఇచ్చిన ముస్లిం వ్యక్తి

హనుమంతుడికి గుడి కట్టడానికి ఓ ముస్లిం వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చి మత సామరస్యాన్ని చాటాడు. అంతేగాక, ఆయన హనుమంతుడి గుడికి ఇచ్చిన విరాళం వల్ల రోడ్డు పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని షాహజ్‌హాపూర్‌కు బాబు అలీ అనే ముస్లిం భూమిని రాసిచ్చారు. ఆ ప్రాంతంలో ఢిల్లీ-లక్నో జాతీయ రహదారి-24ను విస్తరిస్తున్నారు. కచియానీ కేరా గ్రామం మీదుగా ఆ రోడ్డు వేయాలంటూ హనుమంతుడి మందిరం అడ్డంగా ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన బాబు అలీ తన భూమిని ఇచ్చి అక్కడే మరోచోట హనుమంతుడి గుడిని కట్టాలని కోరాడు.

Muslim man donates land: హనుమంతుడికి గుడి కట్టడానికి తన భూమిని ఇచ్చిన ముస్లిం వ్యక్తి

Muslim man donates land: హనుమంతుడికి గుడి కట్టడానికి ఓ ముస్లిం వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చి మత సామరస్యాన్ని చాటాడు. అంతేగాక, ఆయన హనుమంతుడి గుడికి ఇచ్చిన విరాళం వల్ల రోడ్డు పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని షాహజ్‌హాపూర్‌కు బాబు అలీ అనే ముస్లిం భూమిని రాసిచ్చారు. ఆ ప్రాంతంలో ఢిల్లీ-లక్నో జాతీయ రహదారి-24ను విస్తరిస్తున్నారు.

కచియానీ కేరా గ్రామం మీదుగా ఆ రోడ్డు వేయాలంటూ హనుమంతుడి మందిరం అడ్డంగా ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన బాబు అలీ ఆ గుడిని మరో చోటుకు మార్చడానికి తన 0.65 హెక్టార్ల (6500 చదరపు మీటర్ల) భూమిని రాసిచ్చాడని జిల్లా కలెక్టర్ రాంసేవక్ ద్వివేది వివరించారు. ఆ భూమి కూడా జాతీయ రహదారి-24ను విస్తరిస్తున్న ప్రాజెక్టుకు దగ్గరలోనే ఉందని చెప్పారు.

ఆ భూ మార్పిడికి సంబంధించి చట్టపరంగా అన్ని ప్రక్రియలూ పూర్తయ్యాయని డిప్యూటీ కలెక్టర్ రాశీ కృష్ణ తెలిపారు. హిందూ-ముస్లింల ఐక్యతకు అలీ ఓ ఉదాహరణగా నిలిచారని కొనియాడారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..