Sri Lanka Crisis : పెట్రోల్ కోసం రోజంతా క్యూలైన్ లోనే…గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి
శ్రీలంకలో ఇంధన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రాజధాని కొలంబో శివారు పానదురాలో డీజిల్ కోసం క్యూలైన్ లో ఉన్న ఆటో డ్రైవర్(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు.

Sri Lanka Crisis : శ్రీలంకలో ఇంధన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రాజధాని కొలంబో శివారు పానదురాలో డీజిల్ కోసం క్యూలైన్ లో ఉన్న ఆటో డ్రైవర్(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. డీజిల్ కోసం ఎదురు చూస్తూ ఆటోలోనే ఉన్న డ్రైవర్ తన వాహనంలోనే గుండె పోటుతో మరణించాడని అధికారులు తెలిపారు. శ్రీలంకలో కొన్ని నెలలుగా ఇంధన సమస్య వెంటాడుతోంది. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.
రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడలేక వాహనాలను బంకుల దగ్గరే వదిలేసి వెళ్లిపోతున్నారు కొందరు ప్రజలు. శ్రీలంకలో పెట్రోల్ కోసం లైన్లో నిలబడి చనిపోవడం ఇదే మొదటి సారి కాదు. ఒక వ్యక్తి ఎండ వేడికి అలసటతో మరణించాడు. గడిచిన రెండు నెలల కాలంలో కనీసం నలుగురు చనిపోయారు.
కొలంబోకు వాయువ్యంగా ఉన్న పుగోడ అనే ప్రాంతంలో వంటగ్యాస్ కోసం క్యూలైన్లో నిలబడి బుధవారం 64 ఏండ్ల వృద్ధుడు కూడా మరణించాడు. దేశంలో సిలోన్ పెట్రోలియం కార్పోరేషన్ ద్వారా 700 మిలియన లీటర్ల డీజిలో లోడ్ వచ్చిందని ఇది ప్రాధాన్యతా క్రమంలో అత్యవసర సేవల కోసం ఉపయోగించే వాహనాలకు పంపిణీ చేస్తామని ప్రధాన మంత్రి రణిల్ విక్రమ్ సింఘే చెప్పారు.
ఈ ఇంధనం మూడు రోజులపాటు సరిపోతుందని… భారత్ నుంచి మరో 500 మిలియన్ డాలర్లకు సరిపడా ఇంధనం త్వరలో వస్తుందని ఆయన తెలిపారు. శ్రీలంకలో ఇంధన కొరత వల్ల రవాణా సౌకర్యాలు కూడా నిలిచిపోయాయని జాతీయ రవాణా సంఘం తెలిపింది. డాలర్ల కొరత కారణంగా ఇంధనాలు దిగుమతి చేసుకోలేని పరిస్ధితి ఉందని రైల్వే శాఖ తెలిపింది.
శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం కారణంగా ముఖ్యంగా ఆహారం, మందులు, వంటగ్యాస్, ఇతర ఇంధనాలు, అగ్గిపెట్టెలు వంటి నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండటంతో అనేక ప్రాంతాలలో ప్రజలు రోడ్లపై ఆందోళన చేపట్టారు.
ఇంధనం లేకపోవటంతో 50 శాతానికి పైగా ప్రజా రవాణా వ్యవస్ధ కుంటుపడిందని అధికారులు తెలిపారు. 1948లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత దారుణమైన ఆర్ధిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కోంటోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Also Read : ATM Cash Theft : ఏటీఎంలలో డబ్బు డిపాజిట్ చేస్తూ చేతివాటం చూపిన వ్యక్తి అరెస్ట్
- Sri Lanka: అదానీకి పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని మోదీ ఒత్తిడి తెచ్చారంటోన్న శ్రీలంక అధికారి
- Wickremesinghe: మా దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం 2024 వరకు కొనసాగొచ్చు: శ్రీలంక ప్రధాని
- Viral Video : వేగంగా దూసుకొచ్చిన ట్రక్ టైర్.. ఆటోడ్రైవర్ మృతి
- PM Modi: లక్ష్యాన్ని ముందే సాధించిన భారత్: మోదీ
- Sri Lanka: శ్రీలంకకు మరో 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ పంపిన భారత్
1Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్ విచ్లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు
2Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?
3Indian Railways: రైల్లో కప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్రయాణికుడు
4The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
5BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..
6Amarnath Yatra Begins : హరోం హర.. మూడేళ్ల తర్వాత మళ్లీ అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. 80వేల మంది సైనికులతో భారీ భద్రత
7Maharashtra: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్పై మోదీ ప్రశంసల జల్లు
8COVID: మా జీరో-కొవిడ్ విధానమే సరైనది: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
9APSRTC Charges : ఏపీలో మళ్లీ పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు.. ఎప్పటినుంచంటే?
10Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
-
Saggu biyyam : బరువు తగ్గాలా! సగ్గు బియ్యంతో..