Accident : లోయ‌లో ప‌డ్డ బ‌స్సు..24 మంది మృతి

దక్షిణ అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సులో లోయపడటంతో 24మంది మృతి చెందారు. ద‌క్షిణ అమెరికాలోని బొలీవియాలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ప్ర‌జా ర‌వాణా బ‌స్సు చటాక్విలా కమ్యూనిటీ సమీపంలో అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోవటంతో 24మంది చనిపోగా..మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

Accident : లోయ‌లో ప‌డ్డ బ‌స్సు..24 మంది మృతి

bus plunges into ravine 24 people killing: ఇటీవల లోయలో పడుతున్న వాహనాల ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో దక్షిణ అమెరికాలో మరో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 24మంది దుర్మణం పాలవ్వటంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది. ద‌క్షిణ అమెరికాలోని బొలీవియాలో సోమ‌వారం (జులై 12,2021) ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ప్ర‌జా ర‌వాణా బ‌స్సు చటాక్విలా కమ్యూనిటీ సమీపంలో అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది.

ఈ ప్ర‌మాదంలో 24 మంది మృతి చెందగా మరో 10 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటానా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్ని చేపట్టారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.

ప్రజా రవాణా బస్సు రోడ్డు ప‌క్క‌నే ఉన్న లోయ‌లో 100 మీట‌ర్ల లోతులో ప‌డిపోయిన‌ట్లు అదికారులు తెలిపారు. పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది త‌మ స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తోంది. మృత‌దేహాల‌ను వెలికితీస్తున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను శాంటా బార్యరా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్సనందిస్తున్నామని ట్రాఫిక్ అపరేషనల్ యూనిట్ డైరెక్టర్ కల్నల్ జోస్ లూయిస్ అస్పాఫ్ మీడియాకు తెలిపారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 35మంది ఉన్నారని తెలిపారు.