RS 248 Crore Lottery : లాటరీలో రూ.248 కోట్ల ప్రైజ్ మనీ… చారిటీలకు రూ.5 కోట్లు విరాళం
చైనాలోని ఒక వ్యక్తి లాటరీలో రూ.248 కోట్ల ప్రైజ్మనీ గెల్చుకున్నాడు. అక్టోబర్ 24 న ప్రైజ్మనీని రాబట్టుకోవడమే కాకుండా దాదాపు రూ. 5 కోట్లు చారీటీలకు విరాళంగా ఇచ్చాడు. కార్టూన్ వేషంలో వచ్చి డబ్బును తీసుకోవడం విశేషం. ఆ తర్వాత అధికారులు ఆ వ్యక్తిని గ్వాంగ్స్ జువాంగ్ ప్రాంతానికి చెందిన లీగా గుర్తించారు.
RS 248 Crore Lottery : లాటరీలో ఓ వ్యక్తి వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలు గెల్చుకున్నాడు. చైనాలోని ఒక వ్యక్తి లాటరీలో రూ.248 కోట్ల ప్రైజ్మనీ గెల్చుకున్నాడు. అక్టోబర్ 24 న ప్రైజ్మనీని రాబట్టుకోవడమే కాకుండా దాదాపు రూ. 5 కోట్లు చారీటీలకు విరాళంగా ఇచ్చాడు. కార్టూన్ వేషంలో వచ్చి డబ్బును తీసుకోవడం విశేషం. ఆ తర్వాత అధికారులు ఆ వ్యక్తిని గ్వాంగ్స్ జువాంగ్ ప్రాంతానికి చెందిన లీగా గుర్తించారు.
భార్యా పిల్లలకు కూడా ఈ సంగతి చెప్పకపోవడానికి కారణం ఇంత మొత్తంలో డబ్బు చూసి అహంకారంతో ఉండటమే కాక, పిల్లలు సరిగ్గా చదువుకోవడం మానేస్తారని అందుకే చెప్పకూడదని నిర్ణయించుకున్నాడట. చైనా చట్టం ప్రకారం రూ. 48 కోట్లు పన్నుల రూపంలో వెళ్లిపోగా, దాదాపు రూ.147 కోట్లు తాను ఇంటికి తీసుకువెళ్లనున్నాడు.