Breast Milk : కోవిడ్ సోకిన,వ్యాక్సిన్ తీసుకున్న తల్లి పాలలో కోవిడ్ యాంటీబాడీలు
కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్ తీసుకున్న బాలింతల్లో యాంటీబాడీలు ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో
Breast Milk కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్ తీసుకున్న బాలింతల్లో యాంటీబాడీలు ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు వైరస్ నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ కల్పిస్తాయని అంతర్జాతీయ అధ్యయనాలు ఇప్పటికే తెలిపాయి. ఈ నేపథ్యంలో కరోనా బారినపడిన లేదా వ్యాక్సిన్ తీసుకున్న బాలింతల్లో అసలు యాంటీబాడీలు ఏ స్థాయిలో ఉంటాయనే విషయాన్ని తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనం చేపట్టారు.
ఈ అధ్యయం వివరాలు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్(JAMA పీడియాట్రిక్స్)లో తాజాగా పబ్లిష్ అయ్యాయి. అధ్యయనంలో భాగంగా 77మంది బాలింతల నుంచి పరిశోధకులు శాంపిల్స్ ను సేకరించారు. వీరిలో 47మంది కోవిడ్ ఇన్ఫెక్షన్ కు గురైనవారు, 30 మంది వ్యాక్సిన్ తీసుకున్న వారు ఉన్నారు.కాగా, కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తల్లుల్లో వైరస్ను ఎదుర్కొనే ఇమ్యునోగ్లోబులిన్ జి(IgG) యాంటీబాడీలు అధిక స్థాయిలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
అయితే ఈ యాంటీబాడీలు వైరస్ నుంచి చిన్నారులకు రక్షణ కల్పిస్తాయా లేదా అనే విషయం మాత్రం వెల్లడించలేదు. తల్లి పాలలో ఉన్న యాంటీబాడీలు చిన్నారులకు వ్యాక్సిన్ కు ప్రత్యామ్నాయం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న తల్లులో కూడా బలమైన(IgG) రోగనిరోధక ప్రతిస్పందనలు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ రెండు విధాల్లో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు కొవిడ్-19ను తటస్థీకరిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
తాజా పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రొచెస్టర్ మెడికల్ సెంటర్కు చెందిన బ్రిడ్జెట్ యంగ్ మాట్లాడుతూ…కోవిడ్ ఇన్ఫెఫెక్షన్ సోకిన తల్లులతోపాటు వ్యాక్సిన్ తీసుకున్న తల్లుల్లో కూడా కరోనా వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు క్రియాశీలకంగా ఉన్నాయని తాజా అధ్యయనం ద్వారా ఒకేసారి తెలుసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ నుంచి పొందిన యాంటీబాడీలు మూడు నెలల వరకు ఉంటున్నట్లు గుర్తించామన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఇదే తరహాలో కొవిడ్ యాంటీబాడీలు ఉంటున్నట్లు గుర్తించామన్నారు.
ALSO READ Crypto Finance : క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేస్తేనే బెటర్..పార్లమెంటరీ కమిటీ అంగీకారం