Hindu Girl: పాక్‌లో హిందూ బాలిక కిడ్నాప్.. 15 రోజుల్లో నాలుగో ఘటన

పాకిస్తాన్‌లో హిందూ బాలిక అపహరణకు గురైంది. సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలోని, హైదరాబాద్‌లో ఆమె కిడ్నాపైనట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. హిందూ అమ్మాయిలు కిడ్నాప్ కావడం పదిహేను రోజుల్లో ఇది నాలుగోసారి.

Hindu Girl: పాక్‌లో హిందూ బాలిక కిడ్నాప్.. 15 రోజుల్లో నాలుగో ఘటన

Hindu Girl: పాకిస్తాన్‌లో హిందువులు, మైనారిటీలు వివక్షకు గురవుతున్నారు. పలుసార్లు దాడులకు గురవుతున్నారు. హిందూ మహిళల్ని కిడ్నాప్ చేసి, బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారు. తాజాగా పాక్‌లో ఒక హిందూ బాలిక అపహరణకు గురైంది.

Raja Singh: బీజేపీ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన రాజాసింగ్.. నాలుగు పేజీల లేఖ విడుదల

సింధ్ ప్రావిన్స్, హైదరాబాద్ పట్టణానికి చెందిన చంద్ర మెహ్రాజ్ అనే బాలిక స్థానిక ఫతే చౌక్ ప్రాంతంలో కిడ్నాప్‌నకు గురైనట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బయటికి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా, ఆమె అపహరణకు గురైందన్నారు. 15 రోజుల్లో ఇది నాలుగో ఘటన. ఈ మధ్య కాలంలో ముగ్గురిని ఇలా కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. గత నెల 24న 14 సంవత్సరాల మీనా మేఘవార్ అనే ఒక హిందూ బాలికను నజర్ పూర్ అనే ప్రాంతంలో కిడ్నాప్ చేసిన దుండగులు, ఆమెను ఇస్లాంలోకి మార్చారు. ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టారు. ఇంటికి తిరిగొచ్చిన ఆమె దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాఖీ అనే మహిళను కూడా కిడ్నాప్ చేసి, ఇస్లాంలోకి మార్చినట్లు ఆమె భర్త రవి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఆమెకు బలవంతంగా అహ్మద్ అనే వ్యక్తితో పెళ్లి చేసినట్లు కూడా ఆరోపించాడు.

Firecrackers in Delhi: ఢిల్లీలో టపాసులపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ పిటిషన్… సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే

అలాగే కరీనా కుమారి అనే మరో అమ్మాయిని కూడా ఇస్లాంలోకి మార్చి, ఆ వర్గానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. మతం మారడానికి నిరాకరించడంతోపాటు, మరో వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన హిందూ అమ్మాయిని గత మార్చిలో కాల్చి చంపారు. ఇలా పాకిస్తాన్‌లో అనేక చోట్ల హిందువులతోపాటు, మైనారిటీలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతున్నారు. అక్కడ హిందువులు, సిక్కులు, క్రైస్తవులు సహా మైనారిటీలు 3.5 శాతం మంది మాత్రమే ఉన్నారు. కాగా, తాజాగా కిడ్నాప్‌కు గురైన బాలిక ఆచూకీ ఇంకా దొరకలేదు.