Kim Jong Un: అమెరికా, జపాన్‌లను రెచ్చగొడుతున్న నార్త్ కొరియా నియంత కిమ్.. Hwasong-17 క్షిపణి ప్రయోగం..

వరుస అణ్వాయుధాల పరీక్షలతో నార్త్ కొరియా నియంత కిమ్ జపాన్, అమెరికాలను హడలెత్తిస్తున్నారు. అమెరికా, జపాన్‌లను రెచ్చగొడుతు Hwasong-17 క్షిపణి ప్రయోగం..చేసింది నార్త్ కొరియా.

Kim Jong Un: అమెరికా, జపాన్‌లను రెచ్చగొడుతున్న నార్త్ కొరియా నియంత కిమ్.. Hwasong-17 క్షిపణి ప్రయోగం..

Kim Jong Un

Kim Jong Un: నార్త్ కొరియా నరకాసురుడు కిమ్ ప్రపంచ దేశాలు ఏమనుకున్నా..లెక్కచేయడు. అనుకున్నది చేసిచూపిస్తాడు.తలచుకున్నది జరిగిపోవాలంటాడు. ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నా అణ్వాయుధాల ప్రయోగాలు చేస్తునే ఉన్నాడు. ప్రపంచ దేశాల గురించే కాదు తన సొంత దేశ ప్రజల క్షేమాన్ని కూడా పట్టించుకోని నియంత..నిర్థయుడు, కర్కశుడు నార్త్ కొరియా నరకాసురుడు కిమ్ జాంగ్ ఉన్. తన మాటే శిలాశాసనం అంటాడు. దేశంలో ఒక రూల్ పాస్ చేశాడు అంటే అది తూచా తప్పకుండా జరిగి తీరాల్సిందే. లేదంటే ఖతమే సమాధానం అంటాడు కిమ్.ఈక్రమంలో తనదైన శైలిలో మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాడు కిమ్.తాజాగా మాన్ స్టర్ ఖండాంతర క్షిపణి Hwasong-17 ఐసీబీఎం ను ప్రయోగించి అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశాడు.

Also read : North Korea : The Uncle సినిమా చూసినందుకు బాలుడికి 14 ఏళ్లు జైలుశిక్ష వేసిన ఉత్తర కొరియా ప్రభుత్వం

యుక్రెయిన్‌పై రష్యా సైనికచర్యకు వ్యతిరేకంగా నాటో కూటమి నేతలు సమావేశమవుతున్న వేళ.. కిమ్ ఆధ్వరంలో నార్త్ కొరియా(North Korea) కొత్త తరహా ఖండాంతర క్షిపణి Hwasong-17 ఐసీబీఎం ను ప్రయోగించి అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసి తనదైన శైలిలో విర్రవీగుతున్నాడు కిమ్. సుదూర లక్ష్యాలను సునాయాసంగా చేరుకునే ఈ ఐసీబీఎం.. అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా ఢీ కొట్టగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని రాకాసి (Monster) క్షిపణిగా అభివర్ణిస్తున్నారు. రీసెంట్ క్షిపణి ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నేరుగా పర్యవేక్షించినట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది. దీనిని న్యూక్లియర్ వార్ ను నిరోధించేందుకు, దేశ భద్రతలో భాగంగా కిమ్ చేస్తున్న ప్రయత్నంగా స్థానిక మీడియా చెబుతోంది.

రానున్న కాలంలో ఈ క్షిపణి మల్టిపుల్ వార్ హెడ్లను మోసుకుపోయే సామర్థానికి చేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కవ్వింపు చర్యకు దక్షిణకొరియా ధీటుగా స్పందిస్తూ.. పలు క్షిపణులను ప్రయోగించింది. జపాన్‌, అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిని క్షమించరాని కవ్వింపు చర్యగా జపాన్‌ పేర్కొంది. నార్త్ కొరియా వైఖరితో అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉత్తరకొరియా ధిక్కరిస్తోందని అమెరికా ఆరోపించింది.

Also read : Laughing Banned in NorthKorea :దటీజ్ కిమ్..ఉత్తరకొరియాలో ప్రజలు నవ్వొద్దు, తాగొద్దు,వేడుకలు చేసుకోవద్దు..

ఉత్తరకొరియా అమ్ములపొదిలో అత్యంత సుదూర లక్ష్యాలను చేరుకునే ఆయుధం అంటున్నారు నిపుణులు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. 2022 ప్రారంభం నుంచి నార్త్ కొరియా వరుస అణ్వాయుధాల ప్రయోగాలతో దూకుడు పెంచింది. ఐసీబీఎం క్షిపణిని ప్రయోగించడం గత ఐదేళ్లతో ఇదే తొలిసారి కావటం గమనించాల్సిన విషయం. చివరిసారిగా 2017లో దీనిని నార్త్ కొరియా పరీక్షించింది. దక్షిణ కొరియా సైనిక వర్గాల ప్రకారం గురువారం (మార్చి 24,2022) ప్రయోగించిన క్షిపణి 1,080 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌ సముద్ర జలాల్లో పడింది.

ఇది చాలా శక్తిమంతమైనదని, దాదాపు 6,200 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లిందని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 71 నిమిషాలు గగనతలంలో ఉంది. తమను అణ్వస్త్ర దేశంగా గుర్తించాలని, తమపై ఆంక్షలు తొలగించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉత్తరకొరియా డిమాండ్‌ చేస్తోంది. అందులో భాగమే తాజా ప్రయోగం చేసినట్లుగా సమాచారం.