Sushma Swaraj: సుష్మా స్వరాజ్‭పై అమెరికా మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాంపియా రాసిన పుస్తకాన్ని చదివానని, సుష్మా స్వరాజ్‭ని అవమానించే విధంగా పాంపియా రాసుకొచ్చారని అన్నారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆమెను అగౌరవపరిచేలా చేసిన వ్యాఖ్యల్ని తాను ఖండిస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.

Sushma Swaraj: సుష్మా స్వరాజ్‭పై అమెరికా మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

US Ex Top Official's Big Claim On S Jaishankar Commenting On Sushma Swaraj

Sushma Swaraj: భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‭పై అమెరికా విదేశాంగ మాజీ మంత్రి మైక్ పాంపియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె రాసిన ‘నెవర్ గివ్ ఏ ఇంచ్.. ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’ అనే పుస్తకంలో సుష్మా స్వరాజ్ గురించి ప్రస్తావిస్తూ ఆమెను తానెప్పుడూ భారత రాజకీయాల్లో ప్రముఖమైన నాయకురాలిగా భావించలేదని అన్నారు. అందుకే తాను మోదీకి అత్యంత సన్నిహితుడైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‭తో కలిసి పని చేశానని రాసుకొచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగినట్టే కనిపిస్తోంది. భారత్ నుంచి దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

WhatsApp Native Mac App : వాట్సాప్‌ పబ్లిక్ బీటాలో లోకల్ మ్యాక్ యాప్ వచ్చేసింది..!

ఇకపోతే, మోదీ మొదటి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించిన సుష్మా స్వరాజ్‭తో దౌత్యానికి సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పిన ఆయన.. ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్‭తో మాత్రం సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. జయశంకర్ మాట్లాడే ఏడు భాషల్లో ఇంగ్లీష్ ఒకటని, తన కంటే కూడా ఆయన మెరుగ్గా మాట్లాడతారని కొనియాడారు. జయశంకర్‭ను తాను ఎంతగానో ప్రేమిస్తానని చెప్పుకొచ్చారు. సుష్మాతో తాను రాజకీయంగా కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లు పాంపింయా తన పుస్తకంలో పేర్కొనడం గమనార్హం.

Telangana : మూడేళ్లుగా ఆ ఎమ్మెల్యే వేధింపులు..ఇక భరించలేకే రాజీనామా చేసా : జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి

దీనిపై కేంద్ర మంత్రి జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాంపియా రాసిన పుస్తకాన్ని చదివానని, సుష్మా స్వరాజ్‭ని అవమానించే విధంగా పాంపియా రాసుకొచ్చారని అన్నారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆమెను అగౌరవపరిచేలా చేసిన వ్యాఖ్యల్ని తాను ఖండిస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.