America : వీసా జారీ అంశంలో అమెరికా కీలక నిర్ణయం.. వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు

వీసా వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు ఇంటర్వ్యూలను రద్దు చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన అమలు చేస్తామని అమెరికా ప్రభుత్వం తెలిపింది.

America : వీసా జారీ అంశంలో అమెరికా కీలక నిర్ణయం.. వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు

Visa

US key decision on visa : వీసా జారీ చేసే అంశంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వీసా జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. హెచ్1బీ సహా 12 రకాల వీసాలకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు చేసింది. వీసా వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు ఇంటర్వ్యూలను రద్దు చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన అమలు చేస్తామని అమెరికా ప్రభుత్వం తెలిపింది.

హెచ్ 1 బి సహా మొత్తం 12 రకాల విసాల జారీల కోసం తాత్కాలికంగా ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. కొత్త ఏడాదిలో భారత్‌ నుంచి US వెళ్లాలనుకునే టెకీలు, విద్యార్థులకు ఇది ఒకరకంగా రిలీఫ్ అని చెప్పాలి. బైడెన్ సర్కార్.. పాత పద్దతిలోనే H-1బీ వీసాలు జారీ చేయనుంది. ప్రస్తుతం ఉన్న ఆంక్షలు తొలగిస్తూ…2022 నుంచి వ్యక్తిగత ఇంటర్వూలను రద్దు చేస్తూ.. లాటరీ విధానంలోనే H-1బీ వీసాలు మంజూరు చేయనున్నారు.

Omicron Cases : దేశవ్యాప్తంగా 358 ఒమిక్రాన్ కేసులు..17 రాష్ట్రాల్లో వేరియంట్

అమెరికా ప్రతి ఏటా 85 వేల హెచ్‌1 బి వీసాలను జారీ చేస్తోంది. నిర్ణీత కోటాలో 65 వేల మంది, అలాగే అక్కడ ఉన్నత చదువులు చదువుకునే వారికి అదనంగా మరో 20 వేల వీసాలను అందిస్తోంది. టెక్‌ కంపెనీలు, ఇతర సంస్థలు ఈ కోటాకు మించి హెచ్‌1బి వీసా దరఖాస్తులు సమర్పిస్తే… లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి వీసాలను కేటాయించేవారు. ట్రంప్ తీసుకువచ్చిన ఈ విధానంతో ఎన్నారైల నుంచి అలాగే టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో తమకు అన్యాయం జరుగుతోందని కొందరు ఎన్నారైలు కోర్టును ఆశ్రయించారు.

2022 ఆర్థిక సంవత్సరానికి అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు.. ట్రంప్ ప్రవేశపెట్టిన వేతనాల ఆధారిత వీసా కేటాయింపు విధానాన్ని కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు కొట్టివేసింది. దాంతో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్‌ సర్కారు నిర్ణయించింది.

Omicron Death : జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు

కరోనా ప్రభావం, వివిధ కారణాలతో హెచ్‌-1బీ వీసాలతో పాటు ఇతర వీసాల మంజూరుతో ఆలస్యం అవుతోంది. దీంతో వ్యక్తిగత ఇంటర్వూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బైడెన్ సర్కార్ తెలిపింది. ఈ నిర్ణయంతో కొత్త ఏడాదిలో అమెరికా వెళ్లాలనుకునే భారత టెకీలు, విద్యార్థులకు ఊరట లభించనుంది.