Space Tour : గుడ్‌ న్యూస్‌, అంతరిక్ష యాత్రకు టికెట్ల విక్రయం ప్రారంభం

వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష యాత్రకు టికెట్ల విక్రయం ప్రారంభించింది. ఒక్కో టికెట్ ధరను 33 కోట్లుగా నిర్దారించింది. రోదసి యాత్ర చేయాలనుకునేవారు టిక్కెట్లు బుక్ చేసుకోవాలని వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ తెలిపారు

Space Tour : గుడ్‌ న్యూస్‌, అంతరిక్ష యాత్రకు టికెట్ల విక్రయం ప్రారంభం

Space Tour

Space Tour : గత నెలలో బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్‌, అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్ బృందం అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. వీరి అంతరిక్ష ప్రయాణం తర్వాత చాలామందికి ఈ యాత్రపై ఆసక్తి పెరిగింది. నింగి నుంచి భూమిని చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారు కొందరు. అయితే ఈ ప్రయాణం సామాన్యులకు అంత సులువేమి కాదు. శ్రీమంతులకే అంతరిక్ష యాత్ర చేయడం సులువు.. ఎందుకంటే ఒక్కసారి అంతరిక్షలోకి వెళ్లాలంటే రూ.33 కోట్లకు పైనే చెల్లించాలంటుంది వర్జిన్ గెలాక్టిక్.

అయితే ఇంతధరపెట్టి టికెట్ కొనడం అనేది సామాన్యులకు అసాధ్యమనే చెప్పొచ్చు. అది ఊహలకు కూడా అందదు. ఇక రూ.33 కోట్లకు పైనే టికెట్ ధరను నిర్ణయించి స్పేస్ షిప్ టికెట్ బుక్ చేసుకోవాలని వర్జిన్ గెలాక్టిక్ కోరుతుంది. చరిత్రాత్మక రోదసీయాత్ర విజయవంతంగా ముగించుకున్న కొన్ని వారాల తర్వాత స్పేస్‌ విమాన టికెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు గెలాక్టిక్ వ్యవస్థాపకుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్‌ ప్రకటించారు.

ఈ విమానంలో సీటు దక్కించుకోవాలంటే 450,000 (సుమారు రూ.33,382,682) డాలర్లు చెల్లించు కోవాలి. అంతేకాదు ఇందుకు మూడు ప్యాకేజీలను కూడా ప్రకటించింది. సింగిల్ సీట్, మల్టీ-సీట్ ప్యాకేజీ, ఫుల్ ఫ్లైట్ బై అవుట్ ఆఫర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. 2022లో రెవెన్యూ విమానాలను ప్రారంభించే దిశగా పురోగతి సాధిస్తున్నట్లు స్పేస్-టూరిజం కంపెనీ తెలిపింది.వర్జిన్ గెలాక్టిక్ తదుపరి అంతరిక్ష ప్రయాణం సెప్టెంబర్ చివరలో ఉండనుందని అంచనా వేస్తున్నారు. తాజా ప్రకటనతో కంపెనీ షేర్లు 5 శాతం దూసుకెళ్లడం విశేషం.