Putin Nuclear Bomb : మరోసారి పుతిన్ నోట అణుబాంబు మాట..! వణికిపోతున్న పాశ్చాత్య దేశాలు

యుక్రెయిన్ కు భారీ ముప్పు పొంచి ఉందా? రష్యా అణుబాంబును ప్రయోగించనుందా? ఇప్పుడీ భయాలు పాశ్చాత్య దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

Putin Nuclear Bomb : మరోసారి పుతిన్ నోట అణుబాంబు మాట..! వణికిపోతున్న పాశ్చాత్య దేశాలు

Putin Nuclear Bomb : యుక్రెయిన్ కు భారీ ముప్పు పొంచి ఉందా? రష్యా అణుబాంబును ప్రయోగించనుందా? ఇప్పుడీ భయాలు పాశ్చాత్య దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీనికి కారణం రష్యా అధ్యక్షుడు పుతిన్ నోట అణుబాంబు మాట రావడమే.

ఇక, అసలు విషయానికొస్తే.. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరచుగా అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నారు. తద్వారా ఆయన అగ్రరాజ్యం అమెరికా, పాశ్చాత్య దేశాలకు హెచ్చరికలు చేస్తున్నట్టే భావించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ఫ్రాన్స్ దేశాధినేత ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో మాట్లాడుతూ.. హిరోషిమా, నాగసాకి అణు విస్ఫోటనాల గురించి ప్రస్తావించారు పుతిన్. యుద్ధంలో గెలవాలంటే ఇలా ప్రధాన నగరాలపైనే దాడి చేయనక్కర్లేదు అంటూ ఎక్కడైనా అణుబాంబు వేయొచ్చన్న రీతిలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అయితే పుతిన్ మరోసారి అణుయుద్ధం గురించి మాట్లాడడం పాశ్చాత్య దేశాల అధినేతలను కలవరానికి గురిచేస్తోంది. యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, యూరప్ లో శీతాకాలం వస్తే మంచు పరిస్థితుల కారణంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరికొంతకాలం కొనసాగే అవకాశాలున్నాయి. వీలైనంత త్వరగా ఈ యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్ భావిస్తే అణ్వస్త్ర ప్రయోగానికి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు వేయడం తెలిసిందే. 1945 ఆగస్టు 6న హిరోషిమా పైన, ఆగస్టు 9న నాగసాకిపైన రెండు అణుబాంబులు ప్రయోగించింది. ఈ అణ్వస్త్ర ప్రయోగంతో జపాన్ లొంగిపోగా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ రెండు నగరాల్లో ఊహకందని నష్టం వాటిల్లింది.

కాగా.. ఇప్పట్లో రష్యా యుక్రెయిన్‌ యుద్ధం ముగిసిపోవడం లేదా ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనబడటం లేదు. ఒకవైపు రష్యా మిసైల్‌ దాడులతో యుక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పటి నుంచి దక్షిణ యుక్రెయిన్‌లోని ఖేర్సన్‌ బాంబు దాడులకు కేంద్రంగా మారింది. అదీగాక ఈ యుద్ధంలో అత్యంత ఘోరంగా ఖేర్సన్‌ ప్రాంతం నాశనమైంది. రష్యా బలగాలు పట్టణాల్లోకి చొరబడి స్థానిక పౌరులను బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు.