Omicron India : దేశంలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 4,461కు చేరాయి. ఒమిక్రాన్ నుంచి 1,711 మంది బాధితులు కోలుకున్నారు. మరోవైపు దేశంలో మళ్లీ కరోనా పడగ విప్పింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Omicron India : దేశంలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

Omicron (1)

Omicron cases in India : భారత్ లో ఒకవైపు కరోనా.. మరోపు ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దేశంలో భారీగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 4,461కు చేరాయి. ఒమిక్రాన్ నుంచి 1,711 మంది బాధితులు కోలుకున్నారు. మరోవైపు దేశంలో మళ్లీ కరోనా పడగ విప్పింది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 277 మంది వైరస్ సోకి మరణించారు. దేశంలో ప్రస్తుతం 8,21,446 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 4,84,213 మంది మృతి చెందారు.

దేశంలో ఇప్పటివరకు 9,959 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా సోకిన కేసుల సంఖ్య 3కోట్ల 58 లక్షల 75 వేల 790కి పెరిగాయి. దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 45 లక్షల 70 వేల 131 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఒమిక్రాన్ వచ్చిన తర్వాత, క్రియాశీల రోగుల సంఖ్య 8 లక్షల 21 వేల 446కి పెరిగింది. నిన్న దేశంలో 15,79,928 కరోనా వైరస్ నమూనా పరీక్షలు జరగ్గా.. మొత్తం 69 కోట్ల 31 లక్షల 55 వేల 280 నమూనా పరీక్షలు జరిగాయి.

Corona Delhi : ఢిల్లీ జైలులో 114, తీహార్ జైలులో 76 మందికి కరోనా

ఢిల్లీ జైళ్లల్లో కరోనా కలకలం రేపుతోంది. ఢిల్లీ జైలులో 66 మంది ఖైదీలు, 48 మందికి సిబ్బందికి కరోనా సోకింది. తీహార్ జైలులో 42 మంది ఖైదీలు, 34 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మండోలి జైలులో 24 మంది ఖైదీలు, 8 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోహిణి జైలులో ఆరుగురు సిబ్బందికి వైరస్ సోకింది.

దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే రాజ్‌నాథ్‌ సింగ్‌, నిత్యానంద్‌ రాయ్‌ సహా పలువురు కేంద్రమంత్రులు కరోనా బారిన పడగా.. తాజాగా మరో కేంద్రమంత్రి అజయ్‌ భట్‌ కి మహమ్మారి సోకింది. స్వల్ప లక్షణాలే ఉన్నాయని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు