Nagarjuna: నాగార్జున్ నెక్ట్స్ మూవీ కూడా రీమేకేనా..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకునేందుకు ఈ హీరో రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే నాగ్ తన నెక్ట్స్ మూవీని ‘ధమాకా’ చిత్ర రైటర్ ప్రసన్న డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.

Nagarjuna: నాగార్జున్ నెక్ట్స్ మూవీ కూడా రీమేకేనా..?

Akkineni Nagarjuna Next Movie To Be A Remake Of Malyalam Movie

Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకునేందుకు ఈ హీరో రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే నాగ్ తన నెక్ట్స్ మూవీని ‘ధమాకా’ చిత్ర రైటర్ ప్రసన్న డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ప్రసన్న చెప్పిన ఓ కథ నాగ్‌కు బాగా నచ్చడంతో, ఈ సినిమాకు ఓకే చెప్పాడట.

Nagarjuna: అక్కినేని నాగార్జునకు నోటీసులు.. ఏ విషయంలో అంటే..?

ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ వంటి ఇద్దరు యంగ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నారట. ఈ సినిమాను 2019లో వచ్చిన ఓ మలయాళ సూపర్ హిట్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మలయాళంలో తెరకెక్కిన ‘పొరిన్జు మరియమ్ జోస్’ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను పట్టుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాలోని కథను కొద్దిగా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Nagarjuna: ఏంటి.. నాగ్ ఓకే చేసింది రీమేక్ కథనా..?

మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో తమ అభిమాన హీరో ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని అక్కినేని అభిమానులు ఆశగా చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను త్వరలోనే వెల్లడించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.