Amit Shah : రాజద్రోహం చట్టం లేదు ఇకపై దేశ ద్రోహం మాత్రమే.. కొత్త చట్టాలే వర్తిస్తాయి : అమిత్ షా

వాదనలు పూర్తయిన 30 రోజుల్లోనే జడ్జీలు తీర్పు కూడా ఇవ్వాలన్నారు. నేరం ఆధారంగా శిక్షతో పాటు బాధితులకు న్యాయం కల్పించడమే ఈ కొత్త చట్టాల ఉద్దేశమని వెల్లడించారు. పాత చట్టాల సెక్షన్లు అన్నీ మారిపోతాయని చెప్పారు.

Amit Shah : రాజద్రోహం చట్టం లేదు ఇకపై దేశ ద్రోహం మాత్రమే.. కొత్త చట్టాలే వర్తిస్తాయి : అమిత్ షా

Amit Shah (2)

Updated On : August 11, 2023 / 9:10 PM IST

Amit Shah Explain New Laws : రాజద్రోహం చట్టం లేదని ఇకపై దేశ ద్రోహం మాత్రమే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమాత్రం కేసులు ఉండవని స్పష్టం చేశారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరైనా శిక్షార్హులేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం అమిత్ షా విలేకరుల సమావేశంలో కొత్త చట్టాల గురించి వివరించారు. నిర్ణీత కాలపరిమితిలోనే కేసులన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు.

డిశ్చార్జి పిటీషన్లు అన్నీ ఇక ఒకేసారి వేసుకోవడానికే అనుమతి ఇస్తూ సవరణలు చేశామని తెలిపారు. ఏ కేసులోనైనా ఛార్జిషీటు 90 రోజుల్లోనే పోలీసులు నమోదు చేయాలని సూచించారు. ఒకవేళ ఆలస్యమైతే కోర్టు ద్వారా మరో 90 రోజులు మాత్రమే అనుమతి తెచ్చుకోవాలని తెలిపారు. నేరస్థుల ఆస్తులను కూడా జప్తు చేసి బాధితులకు అందజేసే కొత్త సెక్షన్లను కూడా కొత్త చట్టాల్లో చేర్చామని పేర్కొన్నారు.

Botsa Satyanarayana : వచ్చే ఉగాది నాటికి ఆ రెండు పార్టీలు ఉండవు.. పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి లేదు : మంత్రి బొత్స

వాదనలు పూర్తయిన 30 రోజుల్లోనే జడ్జీలు తీర్పు కూడా ఇవ్వాలన్నారు. నేరం ఆధారంగా శిక్షతో పాటు బాధితులకు న్యాయం కల్పించడమే ఈ కొత్త చట్టాల ఉద్దేశమని వెల్లడించారు. పాత చట్టాల సెక్షన్లు అన్నీ మారిపోతాయని చెప్పారు. 302 స్థానంలో సెక్షన్ 99 వస్తుందని, అలాగే పాత సెక్షన్లకు నెంబర్లు అన్నీ మారిపోతాయని పేర్కొన్నారు.

వచ్చే శీతాకాల సమావేశాల్లోనే కొత్త చట్టాలకు ఆమోదముద్ర లభిస్తుందని భావిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. పార్లమెంట్ ఆమోదించిన మరుసటి రోజే నోటిపికేషన్ జారీ అవుతుందని తెలిపారు. నోటిఫికేషన్ జారీ అయిన రోజుకి విచారణలో ఉన్న అన్ని కేసులకు కొత్త చట్టాలే వర్తిస్తాయని తెలిపారు. అయితే శిక్ష పడిన కేసులకు కొత్త చట్టాలు వర్తించవని పేర్కొన్నారు.