PM Modi: సీఎంకు థ్యాంక్స్.. ఎయిర్పోర్టుకు ప్రాణాలతో వచ్చా- ప్రధాని మోదీ
పంజాబ్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ కాన్వాయ్ భద్రతా లోపం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంది. హుస్పేనివాలాకు ముందే కాన్వాయ్ ను నిరససకారులు అడ్డుకున్నారు.
PM Modi: పంజాబ్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ కాన్వాయ్ భద్రతా లోపం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంది. హుస్పేనివాలాకు ముందే కాన్వాయ్ ను నిరససకారులు అడ్డుకున్నారు. దాదాపు 20నిమిషాల వరకూ స్తంభించిపోవడంతో పర్యటనను రద్దు చేసుకుని వెనక్కు వెళ్లిపోయారు మోదీ. బటిండా ఎయిర్పోర్టుకు రిటర్న్ అయిపోయారు.
ఎయిర్పోర్టుకు చేరుకున్న మోదీ.. ‘మీ సీఎంకు థ్యాంక్స్ చెప్పండి. బటిండా ఎయిర్పోర్టు వరకూ ప్రాణాలతో రాగలిగా’ అంటూ కామెంట్ చేశారు. ప్రధాని వస్తుండటంతో అవాంతరాలు లేకుండా చూసుకోవాల్సిన అధికారుల లోపమే దీనికి కారణమని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: వైఎస్ జగన్ అంటే నాకు చాలా అభిమానం!
 
Officials at Bhatinda Airport tell ANI that PM Modi on his return to Bhatinda airport told officials there,“Apne CM ko thanks kehna, ki mein Bhatinda airport tak zinda laut paaya.” pic.twitter.com/GLBAhBhgL6
— ANI (@ANI) January 5, 2022
దీనిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం హోం శాఖ. దాంతో పాటుగా ‘ప్రధానికి భద్రత కల్పించకపోవడం పెద్ద లోపం. ముందస్తుగానే ఈ పర్యటన గురించి పంజాబ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం. పద్ధతి ప్రకారం.. లాజిస్టిక్సో్, సెక్యూరిటీ అంశాలు దృష్టిలో ఉంచుకుని ముందే సిద్ధంగా ఉండాలి’
‘కొన్ని సార్లు అదనపు భద్రత కల్పించడానికి కూడా పంజాబ్ ప్రభుత్వం రెడీగా ఉండాలి. అలాంటిదేం జరగలేదు. అందుకే బటిండా ఎయిర్పోర్టుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని’ హోం శాఖ స్టేట్మెంట్ లో పేర్కొంది.