Balakrishna : సినీ కుటుంబాల మధ్య కలతల్ని చెరిపేయబోతున్న బాలకృష్ణ, అల్లు అరవింద్

సినీ పరిశ్రమలో కొన్ని కుటుంబాల మధ్య లేక కొంతమంది వ్యక్తుల మధ్య దూరం ఉంది. సినిమాలు లేదా రాజకీయాల కారణంగా వారి మధ్య దూరం ఏర్పడింది. ఇది అభిమానులకి కూడా తెలుసు. ఇటీవల 'మా' ఎలక్షన్స్

Balakrishna : సినీ కుటుంబాల మధ్య కలతల్ని చెరిపేయబోతున్న బాలకృష్ణ, అల్లు అరవింద్

Balayya

Balakrishna :  మెగా నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ ప్లాట్ ఫాం `ఆహా` కరోనా టైంలో బాగా సక్సెస్ అయింది. కరోనా తర్వాత కూడా కొత్త కొత్త సినిమాలతో, సిరీస్ లతో, షోలతో నేషనల్ లెవల్ ఓటిటిలకి ధీటుగా సక్సెస్ అవుతుంది. ఇప్పటికే ఆహా లో వైవా హర్ష, సమంతలతో టాక్ షోలను నిర్వహించారు. ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణతో టాక్ షో నిర్వహించనున్నారు. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్నారు అనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఆ షోకి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ప్రోమో షూట్ కూడా జరిగింది. అయితే ఇదంతా అల్లు అరవింద్ ప్లాన్ అని సమాచారం.

సినీ పరిశ్రమలో కొన్ని కుటుంబాల మధ్య లేక కొంతమంది వ్యక్తుల మధ్య దూరం ఉంది. సినిమాలు లేదా రాజకీయాల కారణంగా వారి మధ్య దూరం ఏర్పడింది. ఇది అభిమానులకి కూడా తెలుసు. ఇటీవల ‘మా’ ఎలక్షన్స్ లో కూడా ఆ విభేదాలు బయట పడ్డాయి. ఇప్పుడు లేకపోయినా గతంలో హీరోల మధ్య విభేదాలతో అభిమానులు గొడవపడేవారు. ఇకపై ఇలాంటి విభేదాలు ఉండకూడదు అని సినీ కుటుంబాల మధ్య దూరం ఉండకూడదు అని, ఆర్టిస్టులంతా కలిసి ఉండాలని అల్లు అరవింద్ బాలకృష్ణతో కలిసి ఈ టాక్ షో మొదలు పెట్టారు.

Chiranjeevi : చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇకపై మెగాస్టార్ సోదరి చేతిలో..

ఇప్పటికే టాప్ హీరోస్ లో చిరంజీవి, నాగార్జున హోస్ట్ లుగా టీవిలో చేశారు. ఇప్పుడు బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ అనే షోతో హోస్ట్ గా మారనున్నారు. బాలకృష్ణ ముక్కుసూటితనం వల్ల ఆయనతో కూడా సినీ పరిశ్రమలో కొంతమందికి విభేదాలు ఉన్నాయి. రాజకీయపరంగా కూడా ఉన్నాయి. అందుకే బాలకృష్ణని హోస్ట్ గా ఒప్పించారు అల్లు అరవింద్. ఈ షోలో కేవలం ఆర్టిస్టులే కాక సినీ పరిశ్రమలో అన్ని రంగాలలో పేరు, ప్రఖ్యాతలు సాధించిన అన్ని కుటుంబాలని తీసుకువచ్చి వారి జ్ఞాపకాలను, వారి గతాన్ని, వారి సినీ అనుభవాలని ప్రేక్షకులతో సరదాగా పంచుకోబోతున్నారు.

RGV : గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించిన ఆర్జీవీ

ముందుగా మంచు ప్యామిలీ ఈ షోకి రాబోతుంది. ఆ తర్వాత మెగాస్టార్ ఫ్యామిలీ, ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ.. ఇలా ఒక్కో ఫ్యామిలీని ఒక్కో వారం తీసుకురావటానికి అల్లు అరవింద్, బాలకృష్ణ ప్లాన్ చేసారంట. ఇదే జరిగితే ఆహా కి హైప్ రావడమే కాక సినీ కుటుంబాలని కలపడమే కాక అభిమానులు, ప్రేక్షకులకి మంచి కంటెంట్ తో పాటు ఫుల్ గా ఆనందం కూడా ఇవ్వబోతున్నారు.