Etela Rajender : ధనిక రాష్ట్రమంటున్న సీఎం కేసీఆర్ ధాన్యం ఎందుకు కొనలేకపోతున్నారు : ఈటల

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

Etela Rajender : ధనిక రాష్ట్రమంటున్న సీఎం కేసీఆర్ ధాన్యం ఎందుకు కొనలేకపోతున్నారు : ఈటల

Etala Fire Kcr

Etela Rajender criticized CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. అసహనం మొత్తాన్ని రైతులపై చూపి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల నుండి తెలంగాణ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసిందన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైతాంగం పండించిన ధాన్యం మీద మొత్తం పెట్టుబడి కేంద్రమే పెడుతుందన్నారు. కేంద్రం రా రైస్ మాత్రమే తీసుకుంటామని.. దంపుడు బియ్యం వద్దని చెప్పిందని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు.

Adilabad : చలాన్లు కట్టలేక బైక్‌కు నిప్పు పెట్టాడు

రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనకపోవడంతో రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల ధాన్యం ఎందుకు కొనలేక పోతున్నారని ప్రశ్నిస్తున్నారు.

అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ముందే చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక ముఖ్యమంత్రి మొద్దు నిద్రలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులను వినియోగించుకుని ముఖ్యమంత్రి దౌర్జన్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు.