Sushant Singh Rajput : సుశాంత్ చనిపోయే ముందు నాకు మెసేజ్ చేశాడు.. కానీ నేను అతనిని అవమానించా.. అనురాగ్ కశ్యప్!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ సూసైడ్ హిందీ పరిశ్రమని బాగా దెబ్బ తీసింది. సుశాంత్ మరణించి రెండేళ్లు అవుతున్నా తన మరణం వెనుక ఉన్న మిస్టరీ మాత్రం వీడడం లేదు. ఇది ఇలా ఉంటే సుశాంత్ మరణం గురించి బాలీవుడ్ ప్రముఖ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ మాట్లాడాడు. అతని సూసైడ్ విషయంలో నేను ఇప్పటికి గిల్ట్‌గా ఫీల్ అవుతున్నాను అంటూ బాధపడ్డాడు.

Sushant Singh Rajput : సుశాంత్ చనిపోయే ముందు నాకు మెసేజ్ చేశాడు.. కానీ నేను అతనిని అవమానించా.. అనురాగ్ కశ్యప్!

sushanth singh

Sushant Singh Rajput : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ సూసైడ్ హిందీ పరిశ్రమని బాగా దెబ్బ తీసింది. అతని మరణానికి కారణం ఇండస్ట్రీలోని నెపోటిజం అంటూ ప్రేక్షకులు బాలీవుడ్ ని బాయ్‌కాట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా ఆ ఎఫెక్ట్ బాలీవుడ్ ని వేధిస్తుంది. ఇది ఇలా ఉంటే సుశాంత్ మరణించి రెండేళ్లు అవుతున్నా.. తన మరణం వెనుక ఉన్న మిస్టరీ మాత్రం వీడడం లేదు. ఇక ఇటీవల సుశాంత్ సింగ్ మరణం గురించి అతనికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్.. సుశాంత్‌ది సూసైడ్ కాదు, బాడీ పై గాయాలు ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Sushant Singh Rajput : తన యజమాని కోసం స్వర్గానికి ప్రయాణం.. సుశాంత్ సింగ్ పెంపుడు కుక్క మరణం..

తాజాగా సుశాంత్ మరణం గురించి బాలీవుడ్ ప్రముఖ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ మాట్లాడాడు. అతని సూసైడ్ విషయంలో నేను ఇప్పటికి గిల్ట్‌గా ఫీల్ అవుతున్నాను అంటూ బాధపడ్డాడు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. ‘సుశాంత్ సింగ్ చనిపోయే మూడు వారాలు ముందు నాకు అతడి మేనేజర్ అభయ్ నుంచి మెసేజ్ వచ్చింది. సుశాంత్ నాతో మాట్లాడాలి అనుకుంటున్నాడని, కలిసి సినిమా చేయాలనుకుంటున్నాడని మెసేజ్ చేశాడు. కానీ నేను అతడిని నిరాకరించాను. అతనితో మాట్లాడడం కుదరదు అని మొహం మీదే చెప్పేశా. గతంలో నా సినిమా నుంచి తప్పుకున్నాడు అనే కోపంతో అప్పుడు అలా మాట్లాడాను.

కానీ మూడు వారాలు తరువాత అతడి మరణవార్త విని షాక్ అయ్యాను. అంతేకాదు అంతకుముందు నేను పబ్లిక్ గా అతడి గురించి హర్టింగ్‌గా మాట్లాడినందుకు సుశాంత్ చాలా ఫీల్ అయ్యాడని తెలిసింది. దీంతో అతడి మరణానికి నేను ఒక కారణం అని చాలా భాధ పడ్డాను. అందుకనే వెంటనే ఏమి ఆలోచించకుండా సుశాంత్ మేనేజర్ అభయ్ కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పను. ఆ గిల్ట్‌ నుంచి బయట పడడానికి నాకు దాదాపు ఏడాదిన్నర పట్టింది’ అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.