Bandi sanjay: బుల్లెట్ ప్రూఫ్ వచ్చేస్తోంది.. బండి సంజయ్ కోసం త్వరలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు విడతలు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రలు సైతం చేశారు...
Bandi sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు విడతలు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రలు సైతం చేశారు. హిందుత్వ ఎజెండానే లక్ష్యంగా, హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా బండి సంజయ్ ప్రసంగాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల నేతలే టార్గెట్ గా బండి సంజయ్ ప్రసంగాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల కరీంనగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ క్రమంగా సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ వ్యాఖ్యల తరువాత సంజయ్కు ప్రాణహాని ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ విషయాన్ని సంజయ్ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బీజేపీ అధిష్టానం అలర్ట్ అయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చేందుకు ఆపార్టీ హైకమాండ్ నిర్ణయించింది. టయోటా ఫార్చూనర్ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కోసం పార్టీ తరుపున 2కోట్లు కేటాయించింది.
Modi Praises Bandi Sanjay : శభాష్ అంటూ బండి సంజయ్ భుజంతట్టిన ప్రధాని మోదీ
బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుగోలుకోసం ఇప్పటికే రెండు కంపెనీల దగ్గర కొటేషన్ తీసుకున్న బీజేపీ అధిష్టానం త్వరలో రాష్ట్ర అధ్యక్షుడికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అందించనుంది. బండి సంజయ్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయిస్తూ కేంద్ర పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవటం పట్ల రాష్ట్ర పార్టీ శ్రేణులు, సంజయ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.