Pushpa : ‘పుష్ప’ బెనిఫిట్ షో వేయలేదని థియేటర్ పై దాడి చేసిన ఫ్యాన్స్

బెనిఫిట్ షో వేస్తామని చెప్పి ఆ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసింది. బ్బులు తీసుకొని బెనిఫిట్ షో వేయలేదంటూ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. బన్నీ అభిమానులు ఆగ్రహించి థియేటర్‌పై.....

Pushpa : ‘పుష్ప’ బెనిఫిట్ షో వేయలేదని థియేటర్ పై దాడి చేసిన ఫ్యాన్స్

Pushpa (2)

Pushpa :  అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ‘పుష్ప’. సుక్కు-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకి ముందు నుంచి అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఇక సాంగ్స్ అన్ని హిట్ కావడం, టీజర్, ట్రైలర్ లు కూడా బాగా వైరల్ అవ్వడంతో సినిమాపై మరిన్ని అంచానాలు పెరిగాయి. ఇవాళ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయింది.

అయితే గతంలో రిలీజ్ సినిమాలకి బెనిఫిట్ షో వేసేవారు. ఇప్పుడు చాలా చోట్ల బెనిఫిట్ షో ని రద్దు చేశారు. కానీ తెలంగాణాలో కొన్ని చోట్ల పర్మిషన్స్ తో బెనిఫిట్ షో వేశారు. ఇక ఏపీలో అయితే ఇటీవలే బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ జీవో కూడా పాస్ చేశారు. మొన్న ‘అఖండ’ సినిమా కూడా కొన్ని చోట్ల బెనిఫిట్ షో పడగా ఆ థియేటర్స్ ని క్లోజ్ చేశారు. తాజాగా ఇవాళ ‘పుష్ప’ రిలీజ్ సందర్భంగా ఏపీలో బెనిఫిట్ షోలు పడతాయని ఆశించారు. కానీ ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. అయితే అనంతపురం జిల్లా హిందూపురంలో బాలాజీ థియేటర్ లో బెనిఫిట్ షో వేస్తామని చెప్పి ఆ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసింది. కానీ బెనిఫిట్ షో వేయలేదు.

Trivikram Srinivas : త్రివిక్రమ్ భార్య నృత్య ప్రదర్శన.. స్పెషల్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్

దీంతో డబ్బులు తీసుకొని బెనిఫిట్ షో వేయలేదంటూ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. బన్నీ అభిమానులు ఆగ్రహించి థియేటర్‌పై రాళ్లు విసిరారు. థియేటర్ అద్దాలు పగలగొట్టారు. థియేటర్ ముందు ధర్నా చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టారు. థియేటర్ క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.