Saina Nehwal : హీరో సిద్దార్థ్ పై పరువు నష్టం దావా.. సమన్లు జారీ చేసిన చెన్నై పోలీసులు

చెన్నై పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నటుడు సిద్దార్థ్ పై నమోదైన రెండు ఫిర్యాదుల ఆధారంగా అతడికి సమన్లు పంపాను. బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ని ఆదేశిస్తూ అతడు చేసిన ట్వీట్..

Saina Nehwal : హీరో సిద్దార్థ్ పై పరువు నష్టం దావా.. సమన్లు జారీ చేసిన చెన్నై పోలీసులు

Siddarth

Siddarth :  హీరో సిద్దార్థ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలని అన్ని విషయాలపై చెబుతూ ఉంటాడు. దేశంలో జరిగే చాలా విషయాల్లో తలదూర్చి ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. తాజాగా అతను చేసిన ఓ ట్వీట్ పెద్ద దుమారమే లేపింది. ఇటీవల ప్రధాని మోడీ పంజాబ్ పర్యటించినప్పుడు నిరసన కారుల ఆందోళన నేపథ్యంలో మోడీ కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్ పై నిలిచిపోవాల్సి వచ్చింది. దేశ ప్రధాని పర్యటిస్తున్న చోట సెక్యూరిటీ లోపాలు తలెత్తడం ఏంటి అంటూ పంజాబ్ ప్రభుత్వంపై దేశమంతటా విమర్శలు మొదలయ్యాయి. ఈ సంఘటనని చాలా మంది సెలబ్రిటీలు ఖండిస్తూ పోస్టులు పెట్టారు. ఇందులో భాగంగానే బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా ఈ చర్యని ఖండిస్తూ పోస్ట్ పెట్టింది.

అయితే సైనా ట్వీట్ పై స్పందిస్తూ సిద్ధార్థ్ డబుల్ మీనింగ్ తో కొన్ని కామెంట్స్ చేశాడు. దీంతో సిద్దార్థ్ చేసిన ట్వీట్ వైరల్ అయి పెద్ద వివాదంగా మారింది. సైనా నెహ్వాల్ ని ఉద్దేశిస్తూ చేసిన ఆ ట్వీట్ తో సిద్దార్థ్ చాలా మంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. చాలా మంది సెలబ్రిటీలు సిద్దార్థ్ ను తప్పుపట్టారు. అతని మీద కేసులు కూడా నమోదు అయ్యాయి. మహిళా సంఘాలు కూడా అతన్ని విమర్శించాయి. సైనా నెహ్వాల్ తో పాటు ఆమె భర్త, తండ్రి కూడా దీనిని వ్యతిరేకించారు. అయితే చివరికి సిద్దార్థ్ సారీ చెప్పాడు.

Mahesh Babu : చిన్నారుల పాలిట దేవుడు మహేష్.. 1058వ ప్రాణం..

కానీ కొంతమంది అతనిపై పోలీసులకి కంప్లెయింట్ చేయడంతో కేసులు కూడా నమోదు అయ్యాయి. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సైనాని అగౌరవపరుస్తూ చేసిన ట్వీట్స్ వల్ల గురువారం సిద్దార్థ్ పై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని చెన్నై పోలీస్ కమిషనర్ ధృవీకరించారు. దీంతో చెన్నై పోలీసులు సిద్దార్థ్ కు తాజాగా సమన్లు జారీ చేశారు.

Akhanda : నన్ను, బోయపాటిని దేవుడే కలిపాడు: బాలకృష్ణ

చెన్నై పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నటుడు సిద్దార్థ్ పై నమోదైన రెండు ఫిర్యాదుల ఆధారంగా అతడికి సమన్లు పంపాను. బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ని ఆదేశిస్తూ అతడు చేసిన ట్వీట్ పై సిద్దార్థ్ వాంగ్మూలం రికార్డ్ చేస్తాము. సిద్దార్థ్ చేసిన ట్వీట్ పై ఒక కేసు నమోదు కాగా, మరొకటి సైనా నెహ్వాల్ తరఫునుంచి పరువు నష్టం దావా కేసు నమోదైంది అని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ తెలిపారు. మరి దీనిపై సిద్దార్థ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.