Chiranjeevi Charitable Trust : సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ పునః ప్రారంభం..

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది..

Chiranjeevi Charitable Trust : సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ పునః ప్రారంభం..

Chiranjeevi Charitable Trust

Chiranjeevi Charitable Trust: కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC) ని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్. శంకర్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రెటరీ దొరై లతో పాటు పలువురు సినీ టెక్నీషియన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘కరోనా క్రైసిస్ ఛారిటీ కింద ఈ రోజు సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ, ఫిలిం ఫెడరేషన్ వారందరికీ, అలాగే వారితో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను కూడా ఇందులో చేర్చడం జరిగింది. అలాగే జర్నలిస్ట్‌లకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఈ రోజు సీసీసీ తలపెట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ పునః ప్రారంభించాం. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, అపోలో 24/7 ల సహకారంతో ఈ వ్యాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం అయింది. పునః ప్రారంభం ఎందుకన్నానంటే.. నిజానికి ఇది మూడు వారల క్రితమే మొదలైంది. అయితే వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో గ్యాప్ వచ్చింది.

ఇక ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో ఎంతమంది ఉంటే.. అందరికీ వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే వేలమంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీసం రోజుకు ఐదారు వందల మందికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా అపోలో వారికి నా అభినందనలు తెలుపుతున్నా. అలాగే ఈ కార్యక్రమంలో తప్పకుండా సినిమా కార్మికులు అందరూ పాల్గొనేలా మోటివేట్ చేసిన భరద్వాజ గారికి, ఎన్. శంకర్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారికి, సెక్రెటరీ దొరై గార్లకు అభినందనలు తెలియచేస్తున్నాను. తప్పకుండా సినీ కార్మికులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి..

ఇక కరోనా లాక్‌డౌన్ సమయంలో గతేడాది ఏర్పాటు చేసిన సీసీసీ ఛారిటీ విషయంలో భరద్వాజ గారు, ఎన్ శంకర్, మెహర్ రమేష్, కె ఎల్ ధాము గారు, సి. కళ్యాణ్ గారు, బెనర్జీ, సురేష్ ఇలా అందరు దీనికి సహకరిస్తూ ముందుకు తీసుకెలుతున్నారు. ఫండ్స్ అన్నీ కలెక్ట్ చేసి సీసీసీ ఆధ్వర్యంలో గతేడాది సినిమా కార్మికులకు మూడు సార్లు నిత్యావసర సరుకులు అందచేశాం. సినీ కార్మికులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి సీసీసీ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయం తీసుకున్నాం.

సీసీసీ ఛారిటీ మొదలెట్టినప్పుడు అందరు ముందుకొచ్చి డొనేషన్స్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా సీసీసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పైసా కూడా అవసరం ఉన్నవాళ్లకు చేరేలా చర్యలు తీసుకుంటాం.. దానికి నేను భరోసా.. అలాగే తప్పకుండా 18 ఏళ్ళు నిండిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలి, వ్యాక్సిన్ విషయంలో ఆలోచనలో ఉన్నవారు కూడా ఎలాంటి సంశయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోండి. నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. తప్పకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకుని కరోనా రాకుండా చేద్దాం’’ అన్నారు.