Kerala : నిన్న శబరిమల నేడు గురువాయర్.. డోలీ మోసిన వారికి దండం పెట్టిన చిరంజీవి

భక్తుల కోసం శ్రమ ధార పోస్తున్న శ్రామిక సోదరులందరికీ నా హృదయాంజలి అని తెలిపారు. మెగా అభిమానులు ఫొటోలను షేర్ చేస్తున్నారు...

Kerala : నిన్న శబరిమల నేడు గురువాయర్.. డోలీ మోసిన వారికి దండం పెట్టిన చిరంజీవి

Site

Chiranjeevi Visits Sabarimala Temple : మెగాస్టార్ చిరంజీవి ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు. సతీమణి సురేఖతో కలిసి కేరళ వెళ్లారు. అక్కడ ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆదివారం ఉదయం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. అయితే టెంపుల్ లో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆయన డోలీని ఆశ్రయించాల్సి వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానానికి చేర్చిన శ్రామికులకు ఆయన చేతులెత్తి నమస్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత తాను శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నానని, అందర్నీ అసౌకర్యానికి గురి చేయకుండా డోలీలో ప్రయాణించాల్సి వచ్చిందన్నారు.

Read More : GVL Narasimaharao: మీ సీఎంతో కనీసం అపాయింట్మెంట్ సాధించండి వైకాపా ఎంపీలపై జీవీఎల్ నరసింహారావు ఫైర్

భక్తుల కోసం శ్రమ ధార పోస్తున్న శ్రామిక సోదరులందరికీ నా హృదయాంజలి అని తెలిపారు. మెగా అభిమానులు ఫొటోలను షేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సోమవారం గురువాయర్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. చిరంజీవి అయ్యప్ప స్వామిని ఎక్కువ విశ్వసిస్తారనే సంగతి తెలిసిందే. పలుసార్లు ఆయన అయ్యప్ప మాలను ధరిస్తుంటారు. అంతేగాకుండా… ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరిస్తుంటారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అనంతరం కోలుకున్న తర్వాత.. సినిమా షూటింగ్ లో బిజీ బిజీ అయిపోయారు. ఇప్పటికే దాదాపు ఏడు సినిమాలకి ఓకే చెప్పారు చిరంజీవి. అందులో ఒక సినిమా షూటింగ్ అయిపోగా మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ నడుస్తున్నాయి. చిరంజీవి అన్నిటికి డేట్స్ ఇస్తున్నాడు. ఇటీవల కరోనా వచ్చి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. కరోనా తగ్గడంతో మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంటున్నారు చిరంజీవి.

Read More : Radhe Shyam Glimpse: ఇంతమంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు!

ఇప్పటికే ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి అయ్యింది. మరో వైపు లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, వేదాళం రీమేక్ భోళా శంకర్ మరియు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నాయి. చిరంజీవి వాటికి సమానంగా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు చిరు. ఇటీవలే ఈ సినిమా షూట్ కోసం నయనతార కూడా హైదరాబాద్ కి వచ్చింది. చిరంజీవి ఒక వైపు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ మరో వైపు రాత్రి పూట ‘ఆచార్య’ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పటికే ఆచార్య సినిమా షూట్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఆచార్య సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నారని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. దీంతో పగలు షూటింగ్, రాత్రి డబ్బింగ్ తో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఇటీవలే టాలీవుడ్ లో నెలకొన్న సినిమా పరిశ్రమ ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలను చర్చించేందుకు సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఎండ కార్డు పడుతుందని, శుభవార్త వింటారని ఆయన తెలిపారు.