దటీజ్ CM Stalin.. నరికురవ మహిళను కలిసి, కోట్ల విలువైన సంక్షేమ పథకాల ప్రకటన
తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. అన్ని వర్గాల వారికి చేరువ అవుతున్నారు. సమ న్యాయం చూపుతున్నారు. ఎక్కడా అధికారదర్పం చూపడం లేదు. తనదైన పాలనతో అందరికీ ఆదర్శం
CM Stalin : తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. అన్ని వర్గాల వారికి చేరువ అవుతున్నారు. సమ న్యాయం చూపుతున్నారు. ఎక్కడా అధికారదర్పం చూపడం లేదు. తనదైన పాలనతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా చెంగల్పట్టు జిల్లాకు చెందిన నరికురవర్, ఇరుల తెగకు చెందిన 282 మందికి 4.53 కోట్ల విలువైన సంక్షేమ పథకాలు ప్రకటించారు స్టాలిన్. మామళ్లపురంలోని ఆలయంలో అశ్విని అనే మహిళకు అన్నదానం చేసేందుకు నిరాకరించారు. ఆ మహిళను సీఎం స్టాలిన్ స్వయంగా గురువారం కలిశారు. అశ్విని ఆహ్వానం మేరకు స్టాలిన్ ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెతో కాసేపు మాట్లాడారు.
చెంగల్పట్టు జిల్లా తిరుక్కలుక్కుంరం సర్కిల్, పూన్చేరిలో నివాసముంటున్న నరిక్కువర్, ఇరులర్ వర్గానికి చెందిన 282 మంది లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ సహాయాన్ని సీఎం స్టాలిన్ అందించారు. 81మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. అంతేకాదు అంగన్ వాడీ, పంచాయతీ యూనియన్ స్కూళ్లు నిర్మించాలని ఆదేశించారు. రూ.10లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
Offline Whatsapp Trick: ఈ ట్రిక్తో ఇంటర్నెట్ ఆఫ్ చేయకుండానే.. మీ వాట్సాప్ ఆఫ్లైన్ చేయొచ్చు..!
అశ్విని సీఎం స్టాలిన్ కు థ్యాంక్స్ చెప్పింది. ఇప్పుడు తమకు ఓటర్ ఐడీ, ఆధార్, రేషన్ కార్డులు అందాయన్నారు. ఇదంతా కలలా ఉందని ఆమె అన్నారు. సాధారణంగా రేషన్ కార్డు కావాలంటే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ నాలుగు నెలలు పాటు తిరగాల్సి వచ్చేదన్నారు. అలాంటిది సీఎం స్టాలిన్ కారణంగా కేవలం రెండు రోజుల్లోనే రేషన్ కార్డు వచ్చిందన్నారు.
చెంగల్పట్టులో నరికురవర్, ఇరుల వర్గానికి చెందిన 282 మంది వ్యక్తులకు రూ.4.53 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను సీఎం స్టాలిన్ అనౌన్స్ చేశారు. అంతేకాదు రూ.10 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇళ్ల బాండ్స్, ఫ్యామిలీ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు, క్యాస్ట్ సర్టిఫికెట్స్, వెల్ఫేర్ బోర్డు కార్డులు, బ్యాంకు లోన్లు అందజేశారు. అలాగే సిటీ డెవలప్ మెంట్ ప్లాన్ అప్రూవ్ చేశారు. అంగన్ వాడీ, క్లాస్ రూమ్ ల నిర్మాణాలకు ఆదేశాలు ఇచ్చారు స్టాలిన్.
అంతేకాకుండా సీఎం అనే గర్వం లేకుండా లబ్దిదారులు కూర్చన్న కుర్చీల మధ్యే తనూ ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోని లబ్దిదారులతో ఫోటో దిగారు స్టాలిన్. దీనికి సంబంధించిన ఫోటోను తమిళనాడు సీఎంవో ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఈ ఫోటో ను చూసిన ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
செங்கல்பட்டு மாவட்டம், திருக்கழுக்குன்றம் வட்டம், பூஞ்சேரியில் வசிக்கும் நரிக்குறவர் மற்றும் இருளர் இனத்தைச் சேர்ந்த 282 நபர்களுக்கு ரூ. 4.53 கோடி மதிப்பீட்டிலான அரசு நலத்திட்ட உதவிகளை மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் வழங்கினார். pic.twitter.com/NErZsxVKsO
— CMOTamilNadu (@CMOTamilnadu) November 4, 2021