CWC : ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌కు ఆమోదం.. అధికారంలోకి వస్తే ఈవీఎంల బదులు పేపర్‌ బ్యాలెట్!

బ్లాక్‌ స్థాయి నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటి వరకు నిర్ణీత పదవీకాలం ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడికి సహాయ పడేందుకు కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీలో యువతకు ప్రాతినిధ్యం పెంచాలని నిర్ణయించారు.

CWC : ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌కు ఆమోదం.. అధికారంలోకి వస్తే ఈవీఎంల బదులు పేపర్‌ బ్యాలెట్!

Cwc Meeting

CWC: ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌కు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈవీఎంల వ్యవహారంపై సీడబ్ల్యూసీలో చర్చించి నేతలు.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఈవీఎంలకు స్వస్తిపలికి పేపర్‌ బ్యాలెట్ తీసుకురావాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ఈ అంశంపై భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చించాలని నిర్ణయిం తీసుకున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. బ్లాక్‌ స్థాయి నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటి వరకు నిర్ణీత పదవీకాలం ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ అధ్యక్షుడికి సహాయ పడేందుకు కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీలో యువతకు ప్రాతినిధ్యం పెంచాలని నిర్ణయించారు. పార్టీలో 50 శాతం యువతకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ స్థాయి వరకు 50 శాతం యువత ఉండేలా చర్యలు తీసుకోకున్నారు. 50 శాతం యువత కోటాలో ఎస్ సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకూ చోటు కల్పించాలని నిర్ణయించారు.

Sonia Gandhi : దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోన్న మోదీ ప్రభుత్వం : సోనియా గాంధీ

యువతకు ప్రాధానిధ్యం పెంచాలని సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్తగా పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయాలన్న G23 నేతల సూచనకు ఆమోదముద్ర వేశారు. పార్టీలో ప్రియాంకగాంధీ పాత్రను పెంచడంపైనా సీడబ్ల్యూసీలో చర్చిచారు. మొత్తంగా 20 ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది.