Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో బాలయ్య ఫ్యాన్స్!

ముంబై డాల్ ప్రగ్యా జైస్వాల్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రగ్యానే ట్విట్టర్ లో ప్రకటించింది. కంచె సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చిన అందాల..

Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో బాలయ్య ఫ్యాన్స్!

Akhanda

Pragya Jaiswal: ముంబై డాల్ ప్రగ్యా జైస్వాల్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రగ్యానే ట్విట్టర్ లో ప్రకటించింది. కంచె సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలయ్యతో అఖండ సినిమా చేస్తుంది. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కాగా యూనిట్ ఓ గెట్ టు గెదర్ పార్టీ కూడా చేసుకుంది. ఈ పార్టీకి దర్శకుడు బోయపాటితో పాటు నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు కూడా పాల్గొనగా బాలయ్య, ప్రగ్యా ఈ పార్టీకి హైలెట్ గా నిలిచారు.

Akhanda: యూనిట్ పార్టీ.. ప్రగ్యాతో బాలయ్య చిల్ అవుట్

గత నాలుగు రోజుల క్రితమే పార్టీలో పాల్గొన్న ప్రగ్యా కరోనా బారిన పడినట్లుగా ఆదివారం ప్రకటించింది. గత పది రోజుల నుండి తనను కలిసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే ఐసోలేషన్ లో ఉండాలని కూడా ప్రగ్యా కోరింది. దీంతో ఇప్పుడు బాలయ్య అభిమానులు టెన్షన్ పడుతున్నారు. నాలుగు రోజుల క్రితమే ప్రగ్యా పార్టీలో అందరితో కలిసి మెలిసి కనిపించింది. మాస్క్ కూడా లేకుండా బాలయ్యతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ పార్టీలో పాల్గొన్న యూనిట్ మొత్తం టెన్షన్ లో పడింది.

Akhanda: దీపావళికే బాలయ్య ఆగమనం.. అధికారిక ప్రకటనే బ్యాలెన్స్!

నిజానికి ప్రగ్యా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకోగా గతంలో ఒకసారి కరోనా బారిన పడింది. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి కరోనా సోకింది. అయితే.. ఈసారి స్వల్ప లక్షణాలతో మైల్డ్ గానే ప్రభావం కనిపిస్తుందని.. ఐసోలేషన్ లోనే ఉంటున్నానని కూడా ప్రగ్యా కోరింది. మరి.. ఆమెని కలిసిన వారు సన్నిహితంగా ఉన్నవారు కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక ప్రగ్యా నటించిన లేటెస్ట్ సినిమా అఖండ రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా ప్రకటించకపోగా త్వరలోనే ప్రకటించనున్నారు.