Salman Khan : మరోసారి సల్మాన్‌కు కోర్టు నోటీసులు..

తాజాగా మరో కేసులో సల్మాన్ కి, అతని బాడీగార్డ్ కి కోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019లో ముంబై రోడ్డులో మీడియా తనని ఫొటోలు తీస్తున్నారని కోపం తెచ్చుకొని అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్......

Salman Khan : మరోసారి సల్మాన్‌కు కోర్టు నోటీసులు..

Salman

 

Salman Khan :  బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సల్మాన్ తన సినిమాలతోనే కాక వివాదాలతో, హీరోయిన్స్ తో అఫైర్స్ అంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇప్పటికే సల్మాన్ పై పలు కేసులు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో జైలుకి కూడా వెళ్లి వచ్చాడు సల్మాన్. సల్మాన్ పై ఉన్న అనేక ఆరోణలపై కోర్ట్ నోటీసులు ఇస్తూనే ఉంది. తాజాగా మరో కేసులో సల్మాన్ కి, అతని బాడీగార్డ్ కి కోర్ట్ నోటీసులు జారీ చేసింది.

2019లో ముంబై రోడ్డులో మీడియా తనని ఫొటోలు తీస్తున్నారని కోపం తెచ్చుకొని అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్ అశోక్ పాండే ఫోన్ ని లాక్కొన్నారు సల్మాన్‌ ఖాన్‌, ఆయన బాడీగార్డ్‌. 2019 లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో బాగా వైరల్ అయింది. తన దగ్గరికి వచ్చి ఫోన్‌ లాగేసుకుని బెదరించారని అశోక్‌ పాండే కేసు నమోదు చేసాడు. పలు వాయిదాల అనంతరం తాజాగా ఈ కేసులో సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌ నవాజ్‌ షేక్‌కు అంధేరి కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది.

Police Case : లవ్ బర్డ్స్ నయనతార, విగ్నేష్ శివన్‌పై కేసు నమోదు

గతంలో జర్నలిస్ట్‌ అశోక్‌ పాండే సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌ నవాజ్‌ షేక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు లోకల్‌ పోలీసులను ఈ కేసు తీసుకొని దీనిపై విచారణ చేపట్టాలని కోర్డు ఆదేశించింది. అయితే దీనిపై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్‌ సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌కు ప్రతికూలంగా ఉంది. దీంతో జర్నలిస్ట్ మరోసారి కోర్టుని ఆశ్రయించగా తాజాగా వారిద్దరికీ కోర్టు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణని ఏప్రిల్‌ 5కి వాయిదా వేసింది.