Police Case : లవ్ బర్డ్స్ నయనతార, విగ్నేష్ శివన్పై కేసు నమోదు
రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను బ్యాన్ చేసి దాని ఓనర్స్ అయిన నయన తార, విఘ్నేశ్ శివన్లను అరెస్ట్ చేయాలని తమిళనాడు సాలిగ్రామానికి చెందిన సోషలిస్ట్ కణ్ణన్ అనే వ్యక్తి చెన్నై....
Nayanatara : లేడీ సూపర్ స్టార్ నయనతార విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఇప్పటికే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి టెంపుల్స్ కి, టూరింగ్ స్పాట్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి యువ దర్శకులతో మంచి మంచి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ లవ్ బర్డ్స్ పై పోలీస్ కేసు నమోదయింది.
రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను బ్యాన్ చేసి దాని ఓనర్స్ అయిన నయన తార, విఘ్నేశ్ శివన్లను అరెస్ట్ చేయాలని తమిళనాడు సాలిగ్రామానికి చెందిన సోషలిస్ట్ కణ్ణన్ అనే వ్యక్తి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలాయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసు విషయం కోలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ కేసులో.. తమిళనాడు ప్రభుత్వం ఇటీవల రౌడీల అణిచివేతకు చర్యలు తీసుకుంటున్న సమయంలో రౌడీలను మరింత ప్రోత్సహించేలా నయనతార, ఆమె కాబోయే భర్త విఘ్నేశ్ శివన్ తీరు ఉంది. వారి నిర్మాణ సంస్థకి కూడా రౌడీ పిక్చర్స్ అనే పేరుని పెట్టారు. ఇటీవల విగ్నేష్ శివన్ కి అజిత్ తో సినిమా ఓకే అవ్వడంతో రౌడీ పిక్చర్స్ టీమ్ కలిసి వారి ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో పటాకులు పేల్చారు. ప్రజలకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
Vijayendra Prasad : ఎన్టీఆర్, చరణ్ కొట్టుకుంటుంటే నాకు ఏడుపొచ్చింది
రౌడీ పిక్చర్స్ సంస్థ తీరుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, తక్షణమే నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్పై నిషేధం విధించి నటి నయనతార, విఘ్నేష్ శివన్లపై కేసు నమోదు చేయాలని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కణ్ణన్ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు.