Covid-19: ఒక్కరోజే వెయ్యి దాటిన కరోనా కేసులు

ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,701 కరోనా టెస్టులు చేయగా, 1,009 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

Covid-19: ఒక్కరోజే వెయ్యి దాటిన కరోనా కేసులు

Covid

Covid-19: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బుధవారం సాయంత్రానికి, గడిచిన 24 గంటల్లో 17,701 కరోనా టెస్టులు చేయగా, 1,009 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మంగళవారం నమోదైన కేసులతో పోలిస్తే, బుధవారం 377 కేసులు ఎక్కువ నమోదవడం గమనార్హం. తాజా అంచనాల ప్రకారం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 5.70 శాతానికి చేరింది.

Covid-19: మాస్క్ లేకపోతే ఫైన్.. మళ్లీ అమల్లోకొచ్చిన నిబంధన!

కరోనాతో తాజాగా ఒకరు మరణించగా, 314 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఫోర్త్ వేవ్‌కు దారితీస్తుందా అని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనాను అదుపు చేసే చర్యలు చేపట్టింది. సభలు, సమావేశాలు, ఫంక్షన్లపై దృష్టి సారించింది. మాస్క్ తప్పనిసరి చేస్తూ రూల్ తీసుకొచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.