Dil Raju : ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు, హరీష్ శంకర్

తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి ఓటీటీలో డైరెక్ట్ గా సిరీస్ లు నిర్మించడానినికి రంగంలోకి దిగారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ జీ5............

Dil Raju : ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు, హరీష్ శంకర్

Atm

Dil Raju :   ఇటీవల ఓటీటీకి బాగా డిమాండ్ పెరిగింది. అనేక రకాల ఓటీటీ సంస్థలు కొత్త కొత్త కంటెంట్స్ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. సినీ పరిశ్రమకి చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్స్, నిర్మాతలు సైతం ఓటీటీకి క్యూ కడుతున్నారు. ఓటీటీలలో సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అనేక నిర్మాణ సంస్థలు, చాలా మంది డైరెక్టర్స్ ఓటీటీలలో అడుగుపెట్టారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి ఓటీటీలో డైరెక్ట్ గా సిరీస్ లు నిర్మించడానినికి రంగంలోకి దిగారు.

 

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ జీ5 భాగస్వామ్యంలో దిల్ రాజు – హరీష్ శంకర్ కలిసి ”ATM” అనే వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్నారు. ”హైదరాబాద్ నగరంలో జరిగే ఓ విచిత్రమైన దొంగతనం, దీని వెనుక ఉన్న ఇద్దరు మేధావులు నేపథ్యంలో” ఈ సిరీస్ ఉండబోతుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు.

Pushpa : ‘పుష్ప’ సినిమాని ఈ స్టార్లంతా వద్దు అనుకున్నారు.. ఇప్పుడు బాధపడుతున్నారు..

దిల్ రాజు ప్రొడక్షన్ లో దిల్ రాజు కుమార్తె హన్షితరెడ్డి మరియు అల్లుడు హర్షిత్ రెడ్డిలతో కలిసి హరీష్ శంకర్ ఈ ATM వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. అంతే కాక హరీష్ శంకర్ దీనికి కథ కూడా అందించారు. సి. చంద్ర మోహన్ దీనికి స్క్రీన్ ప్లే – దర్శకత్వం వహించనున్నారు. జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది.