Dil Raju : దిల్ రాజు పాన్ ఇండియా టార్గెట్.. సౌత్ సినిమాలతోనే..

ఇక నుంచి ఈ బ్యానర్ లోని ప్రతీ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందబోతోంది. రీసెంట్ గా జరిగిన శాకుంతలం మీడియా ఇంటరాక్షన్ లో దిల్ రాజు ఈ విషయాన్ని రివీల్ చేశారు.

Dil Raju : దిల్ రాజు పాన్ ఇండియా టార్గెట్.. సౌత్ సినిమాలతోనే..

Dil Raju Target Pan India with Big Movies and Big Stars

Dil Raju :  టాలీవుడ్(Tollywood) టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్(Producer) దిల్ రాజు నుంచి ఇకపై రాబోయేవి అన్నీ భారీ బడ్జెట్ లోని పాన్ ఇండియా(Pan India) సినిమాలే. ప్రస్తుతం దిల్ రాజు లైన్ చూస్తే మతిపోతుంది. క్రేజీ కాంబోస్ అన్నీ ఆయన ప్రొడక్షన్స్ లోనే రాబోతున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్ పై గత 20 ఏళ్ళ నుంచి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ నిర్మిస్తూ టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు దిల్ రాజు. ఇన్నాళ్లు తెలుగులో(Telugu) సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఇప్పుడు పాన్ ఇండియా మీద కన్నేశారు.

ఇక నుంచి ఈ బ్యానర్ లోని ప్రతీ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందబోతోంది. రీసెంట్ గా జరిగిన శాకుంతలం మీడియా ఇంటరాక్షన్ లో దిల్ రాజు ఈ విషయాన్ని రివీల్ చేశారు. తన కూతురు, అల్లుడితో దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే మరో నిర్మాణ సంస్థని స్థాపింపచేసి ఆ ప్రొడక్షన్ లో చిన్న సినిమాలు చేస్తూ తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మాత్రం భారీ సినిమాలనే ప్లాన్ చేయాలని చూస్తున్నారు దిల్ రాజు.

ఇటీవల మొదటిసారి తమిళ్ సినిమా చేశారు దిల్ రాజు. విజయ్ హీరోగా తెరకెక్కిన వరిసు సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా, శంకర్ డైరెక్షన్ లోని ‘గేమ్ చేంజర్’ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా సినిమా ఉన్నట్టు దిల్ రాజు చెప్పారు. అలాగే రజినీకాంత్ హీరోగా బాబీ లేదా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా కూడా ఉండబోతుందని తెలిపారు. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ‘జటాయు’ ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ సినిమా కూడా స్టార్ హీరోతోనే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

Posani krishna Murali : పోసానికి మరోసారి కరోనా? హాస్పిటల్ లో చేసిన పోసాని కృష్ణ మురళీ..

ఇలా అన్ని భారీ సినిమాలు, స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. ఇవే కాకుండా మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయడానికి దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నారు. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ – రామ్ చరణ్ హీరోగా చేయబోయే సినిమాని కూడా దిల్ రాజు నిర్మించబోతున్నారు. బాలకృష్ణ – త్రివిక్రమ్ సరికొత్త కాంబోని సెట్ చేయడానికి దిల్ రాజు ట్రై చేస్తున్నారు. వీటితో పాటు పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. వీటిల్లో చాలా వరకు వంద కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కనున్న సినిమాలే. దీంతో ఇన్నాళ్లు తెలుగులో సక్సెస్ అయిన దిల్ రాజు ఆల్రెడీ తమిళ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా సౌత్ లోనే, సౌత్ స్టార్స్ తో భారీ సినిమాలు నిర్మించి పాన్ ఇండియా సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. మరి దిల్ రాజు ఇంకెన్ని భారీ సినిమాలు తీసుకొస్తాడో చూడాలి.