Odisha : మద్యం మత్తులో సైన్ బోర్డుపై పుష్-అప్‌లు చేసిన వ్యక్తి వీడియో వైరల్

చాలాచోట్ల మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. రకరకాల ఫీట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒడిశాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి సైన్ బోర్డుపై పుష్-అప్ లు చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Odisha : మద్యం మత్తులో సైన్ బోర్డుపై పుష్-అప్‌లు చేసిన వ్యక్తి వీడియో వైరల్

Odisha

Odisha : ఫుల్‌గా తాగాడు. ఎలా ఎక్కగలిగాడో ఓ వ్యక్తి  హై సైన్ బోర్డు ఎక్కాడు. ఇక అక్కడ పుష్-అప్‌లు చేశాడు. చూసేవారికి భయం కలిగించే ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

Harmful Use Of Alcohol : మద్యంతో సంబంధం ఉన్న ప్రమాదాలపై నిపుణులు ఏంచెబుతున్నారంటే ?

మద్యం వ్యక్తిని స్పృహలో లేకుండా చేస్తుంది. తాము ఏం చేస్తున్నారనే విచక్షణను కోల్పోతారు. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు. ఒడిశాలోని సంబల్ పూర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఫుల్‌గా మద్యం తాగిన వ్యక్తి  సైన్ బోర్డుపై పుష్-అప్‌లు చేశాడు. దారిన వెళ్లే వాహన దారులు ఈ ఘటన చూసి షాకయ్యారు. అతనికి ప్రాణాలకు ప్రమాదం సంభవించవచ్చని ఆందోళన పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు ఆ వ్యక్తి పరారయ్యాడు. sambalpuri_mahani._andpatnagarh_top_models అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Chinese Influencer : నాన్‌స్టాప్‌గా 4 బాటిళ్ల మద్యం తాగేశాడు.. కట్ చేస్తే ఘోరం జరిగిపోయింది.. షాకింగ్ వీడియో

‘ఆర్మీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడా?’ అని కొందరు.. ‘అతను తాగాడని అందరూ అనుకుంటున్నారు.. కానీ అతను పాపులర్ అవ్వడానికి ఈ ఫీట్ చేస్తున్నాడు’ అని కొందరు కామెంట్లు పెట్టారు. ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన మందుబాబులు తప్పతాగి రోడ్లపై పడిపోయిన దృశ్యాలు కనిపిస్తూనే ఉంటున్నాయి. లేదంటే ఇలాంటి విపరీతమైన పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఫీట్లు చేసే మందుబాబులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sambalpuri Mahani (@sambalpuri_mahani._)