2022 Telugu Films: ఒక్కో హీరో నాలుగైదు సినిమాలు.. ఏడాదంతా జాతరే!

2022లో తీన్ మార్ ఆడేందుకు రెడీ అయ్యారు స్టార్స్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేసి సినిమాలతో ఫ్యాన్స్ కు మస్త్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ఇయర్ లో వరుసగా సినిమాలను లైన్ లో పెట్టిన..

2022 Telugu Films: ఒక్కో హీరో నాలుగైదు సినిమాలు.. ఏడాదంతా జాతరే!

2022 Telugu Films

2022 Telugu Films: 2022లో తీన్ మార్ ఆడేందుకు రెడీ అయ్యారు స్టార్స్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేసి సినిమాలతో ఫ్యాన్స్ కు మస్త్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ఇయర్ లో వరుసగా సినిమాలను లైన్ లో పెట్టిన ఆ హీరోలు.. నెక్ట్స్ ఇయర్ దబిడి దిబిడే అంటున్నారు. కొవిడ్ పరిస్థితులు, రిలీజ్ క్లాషెస్.. ఇలాంటి టైంలో గట్టిగా ఒక సినిమాను రిలీజ్ చేయాలంటేనే నానా తంటాలు పడుతున్నారు మేకర్స్. 2021లో కొంతమంది హీరోలైతే థియేటర్ కాదు కదా ఓటీటీ మొహం కూడా చూడలేదు. అలాంటిది 2022ని దున్నేస్తామంటున్నారు. ఒకటి, రెండు కాదు ఒకే ఏడాది మూడు సినిమాలతో వస్తామంటున్నారు. ఈ లెక్కలు చూసి ఫ్యాన్స్ కూడా మస్త్ ఖుషీ అవుతున్నారు.

Ashu Reddy: ఆగని హాట్ పోజులు.. ఆపని ఫోటో షూట్లు!

అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ, రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ నలుగురు హీరోలు కలిసి 12 సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరు నాలుగైదు సినిమాలను సెట్స్ పై ఉంచారు. వాటిలో ఎక్కువ భాగం అన్నీ షూటింగ్ చివరి దశలోనే ఉన్నాయి. దాంతో అన్ని సినిమాలు పెద్ద గ్యాప్ లేకుండానే రిలీజ్ కాబోతున్నాయి.

Radhe Shyam: తెగ నచ్చేసిన ట్రైలర్.. సినిమా ఎలా ఉంటుందో లెక్కలేసుకుంటున్న ఫ్యాన్స్!

2021లో ఒక్క సినిమాతో కూడా రాని మెగాస్టార్.. ఈ ఇయర్ ఐదు సినిమాలను లైన్ లో పెట్టారు. ఇక చకచకా వాటి షూటింగ్స్ చేసేస్తున్న చిరూ.. 2022ని టార్గెట్ చేసారు. ఫిబ్రవరి 4న కొడుకు చరణ్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఆ తర్వాత రెండు మూడు నెలల గ్యాప్ లోనే గాడ్ ఫాదర్ థియేటర్స్ కి రానుంది. ఇక 2022 దసరాకు వేదాళం రీమేక్ భోళా శంకర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి.

Disha Patani: నెట్టింటిని షేక్ చేస్తున్న లోఫర్ బ్యూటీ

అన్నయ్య మూడు సినిమాలతో రాబోతుంటే తమ్ముడు కూడా తగ్గేలా కనిపించడం లేదు. 2022 సంక్రాంతి రేస్ నుంచి తప్పుకొని ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ తో వచ్చేస్తున్నారు పవన్ కల్యాణ్. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న హరిహర వీరమల్లు కూడా 2022 లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ముందుగా అనుకున్నట్టు ఏప్రిల్ 29న వీరమల్లు రాకపోవచ్చు. దీంతో పాటు హరీశ్‌ శంకర్ కాంబోలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్. అదే జరిగితే భగత్ సింగ్ 2022 క్రిస్ మస్ ను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది.

83 Movie: 83 సినిమాపై బాలీవుడ్ కాన్ఫిడెంట్.. టీమ్ ఇండియాకు ప్రీమియర్ షో!

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ఐదు సినిమాలు చేస్తున్నారు. ఇందులో ఖిలాడి 2022 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా డేట్ ఫిక్స్ చేసుకుంది. అలాగే మార్చిలో రామారావు ఆన్ డ్యూటీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఏడాది మధ్యలో త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో నటిస్తున్న ధమాకా విడుదల కానుందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే 2022 చివర్లో మరో సినిమా రావాణాసురను మాస్ రాజా తీసుకొచ్చిన ఆశ్యర్యం లేదు.

Shyam Singha Roy: నాని శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ

ఇక ప్రభాస్ కూడా 2022లో మూడు సినిమాలతో రాబోతున్నాడు. గ్లోబర్ స్టార్ ఫ్యాన్స్ కిది పండుగ లాంటి వార్తే. జనవరి 14న ఈయన నటిస్తున్న రాధే శ్యామ్ హై రేంజ్ లో ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. అలాగే అదే రేంజ్ లో ఆగస్టు 11న ఆది పురుష్ రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ 14న సలార్ రాదని అర్ధమైపోతుంది కానీ ఆ సినిమా కూడా 2022 లోనే విడుదల కావడం ఖాయం. మొత్తానికి ఈ నలుగురు హీరోలు 2022 మాది అని చెప్తుంటే… వీళ్ల ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హల్చల్ చేసేస్తున్నారు.