Fan Died in Event : బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమాని మృతి

శుక్రవారం సాయంత్రం జరిగిన బింబిసార ప్రీ రిలీజ్ ఓ అభిమాని మరణించాడు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలానికి చెందిన పుట్టా సాయిరామ్ అనే వ్యక్తి ఇక్కడ హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ కూకట్ పల్లిలో.....

Fan Died in Event : బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమాని మృతి

Ntr

Bimbisara :  కల్యాణ్‌ రామ్‌ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్‌ హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘బింబిసార’. వశిష్ఠ్‌ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో విషాదం చోటు చేసుకుంది.

Jr NTR : థియేటర్లకి జనాలు రావడం లేదని అంటున్నారు.. నేను నమ్మను..

శుక్రవారం సాయంత్రం జరిగిన బింబిసార ప్రీ రిలీజ్ ఓ అభిమాని మరణించాడు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలానికి చెందిన పుట్టా సాయిరామ్ అనే వ్యక్తి ఇక్కడ హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ కూకట్ పల్లిలో నివాసం ఉంటున్నాడు. నందమూరి అభిమాని కావడంతో బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. అయితే ఈవెంట్లో సాయిరామ్ కి ఫిట్స్ రావడంతో చికిత్స నిమిత్తం కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతుదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అభిమాని మృతి చెందడంతో నందమూరి అభిమానుల్లో విషాదం నెలకొంది. సాయిరామ్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

 

ఈ ఘటనపై బింబిసార టీం స్పందిస్తూ ఓ లేఖని విడుదల చేసింది. ఈ లేఖలో.. మమ్మల్ని తీవ్రంగా కలచివేసిన ఒక దురదృష్టకర సంఘటన మా దృష్టికి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలానికి చెందిన సాయిరామ్ నందమూరి కుటుంబానికి వీరాభిమాని. నిన్న రాత్రి జరిగిన కార్యక్రమానికి హాజరైన పుట్టా సాయి రామ్ ఇక లేరు. సాయిరాం కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. అలాగే ఆ కుటుంబానికి ఏ విధంగానైనా మేము అండగా ఉంటాము అని తెలిపారు బింబిసార టీం.