జాన్వీ కపూర్ గుడ్ లక్‌కు ఆటంకంగా రైతుల ఆందోళన

జాన్వీ కపూర్ గుడ్ లక్‌కు ఆటంకంగా రైతుల ఆందోళన

Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ కు రైతుల ఆందోళన ఆటంకంగా మారింది. పంజాబ్ లోని పాటియాలా జిల్లాలో ఓ రైతుల గ్రూపు అడ్డుగా వచ్చి కొత్త రైతు చట్టాలకు తాము చేస్తున్న నిరసనకు జాన్వీ కూడా సపోర్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. నిజానికి ఈ గుడ్ లక్ జెర్రీ సినిమాకు బ్రేక్ వేయడం ఇది రెండోసారి.

పంజాబ్ బాగ్ లోని పాటియాలా జిల్లాలో జరుగుతున్న షూటింగ్‌కు ఆందోళనలో.. తమకు సపోర్ట్ చేయమని జాన్వీ కపూర్ ను డిమాండ్ చేశారు. ‘మేం వాళ్లకు ముందుగానే చెప్పాం. ఇక్కడ జరిగే షూటింగ్ లకు ఎవ్వరినీ అనుమతించం. ఇంకా షూటింగ్ నిర్వహిస్తూనే ఉన్నాం. అందుకే ఇవాళ కూడా అడ్డుకున్నాం’

ఎవ్వరి మీదా మాకు ద్వేషం లేదు. ఒకసారి ఆమె రైతులకు సపోర్టింగ్ గా స్టేట్ మెంట్ ఇస్తే షూటింగ్ కు అనుమతిస్తాం. కాసేపటి తర్వాత మళ్లీ స్టార్ట్ చేశారు. పంజాబ్, హర్యానా, వెస్టరన్ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్నారు. రైతు చట్టాలను సవరించాలని.. ధరలకు కనీస మద్ధతు ప్రకటించేలా లీగల్ గ్యారంటీ కోసం పోరాడుతున్నారు.