SSMB28 : త్రివిక్రమ్ మహేష్ సినిమాకి ముహూర్తం క్లాప్..
మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు......
SSMB28 : ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మహేష్ మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంటున్నాడు. ‘సర్కారు వారి పాట’ సినిమాలో కొద్ది శాతం షూటింగ్ మిగిలి ఉంది. ప్రస్తుతం అది కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మహేష్. ‘సర్కారు వారి పాట’ సినిమాని మే 1న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు చిత్ర యూనిట్. తాజాగా మహేష్ తర్వాతి సినిమా కూడా ప్రారంభమవుతుంది .
Puneeth Rajkumar : పునీత్ రాజకుమార్ ఫ్యామిలీని పరామర్శించడానికి బెంగుళూర్ పయనమైన అల్లు అర్జున్
మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ ఈ సినిమా ముహూర్తం కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి నమ్రత శిరోద్కర్, త్రివిక్రమ్, పూజా హెగ్డే, నిర్మాత చినబాబు మరియు చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ కార్యక్రమానికి మహేష్ హాజరవ్వకపోవడం విశేషం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.
#SSMB28 grand launch ?@urstrulyMahesh #SSMB28FirstClap pic.twitter.com/Kz66M8zEJK
— Suresh Kondi (@SureshKondi_) February 3, 2022