Mumbai : షాకింగ్ న్యూస్, డెల్టా ప్లస్తో వృద్ధురాలి మృతి
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లతో అతలాకుతలం అయిన మహారాష్ట్రలో ఇప్పుడు డెల్టాప్లస్ వేరియంట్.. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వేగంగా విస్తరిస్తూ ప్రాణాలు మింగేస్తోంది. ముంబైలో డెల్టాప్లస్ ఫస్ట్ డెత్ నమోదైంది. డెల్టాప్లస్ వేరియంట్ సోకి 63 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది.
Delta Plus : కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లతో అతలాకుతలం అయిన మహారాష్ట్రలో ఇప్పుడు డెల్టాప్లస్ వేరియంట్.. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వేగంగా విస్తరిస్తూ ప్రాణాలు మింగేస్తోంది. ముంబైలో డెల్టాప్లస్ ఫస్ట్ డెత్ నమోదైంది. డెల్టాప్లస్ వేరియంట్ సోకి 63 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది. దీంతో మహారాష్ట్రలో డెల్టాప్లస్ బలితీసుకున్న వారి సంఖ్య రెండుకు పెరిగింది. జూన్లో రత్నగిరిలో 80 ఏళ్ల వృద్ధురాలు కూడా డెల్టాప్లస్ వేరియంట్తోనే చనిపోయింది.
Read More : Pooja Hegde: నా ప్రయాణం తలచుకుంటే గర్వంగా అనిపిస్తుంది
ముంబై ఈస్టర్న్ సబర్బ్కి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలికి జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు రావడంతో పరీక్షలు చేయించుకుంది. జూలై 21న ఆమెకు కరోనా ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో జూలై 24న ఆమెను ఐసీయూలో చేర్చారు వైద్యులు. మూడు రోజుల చికిత్స అనంతరం 27న ఆమె మృతి చెందింది. మరణానంతరం ఆమెకు డెల్టాప్లస్ వేరియంట్గా గుర్తించారు అధికారులు. ఆగస్ట్ 11న ఈ విషయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు వైద్యాధికారులకు తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు పరీక్షలు జరపగా.. ఆరుగురికి కరోనా పాజిటివ్గా తేలింది. ఇందులో ఇద్దరికి డెల్టా ప్లస్ వేరియంట్ ఎటాక్ అయినట్టు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
Read More : Lady Fingers: బెండ అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం
మృతి చెందిన వృద్ధురాలు రెండు డోసులు వేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కరోనా పాజిటివ్గా తేలేకంటే ముందే ఆమె కోవిషీల్డ్ రెండు డోసులు వేసుకున్నట్టుగా తెలిపారు. రెండు వ్యాక్సిన్ డోసులు వేసుకున్న తర్వాత కూడా కరోనా రావడం.. అందులోనూ డెల్టా ప్లస్ వేరియంట్ ఎటాక్ కావడంతో వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆమె కుటుంబంలోనే మరో ఇద్దరికి కూడా డెల్టా ప్లస్ నిర్ధారణ కావడంతో వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.