Meera Mithun : షూటింగ్ లోంచి పారిపోయిన హీరోయిన్.. కథ మార్చేసిన డైరెక్టర్
2రోజుల్లో షూటింగ్ పూర్తి అవుతుందనగా మీరా మిథున్ తనతో వచ్చిన మరో ఆరుగురు వ్యక్తులతో కలసి ఎవరికీ చెప్పకుండా పారిపోయిందని, దీంతో చేసేదేమి లేక ఆమె లేకుండానే కథను .........
Meera Mithun : తమిళ నటి మీరా మిథున్ అప్పుడప్పుడు వివాదాల్లో ఉంటుంది. తమిళ్ లో కొన్ని సినిమాలు చేసిన మీరా మిథున్ ఆ తర్వాత కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం మీరా మరో వివాదంలో చిక్కుకుంది. మీరా హీరోయిన్ గా తమిళ్ లో ‘పేయి కానోమ్’ అనే సినిమా చేస్తుంది. గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తేని భారత్ ఆర్.సురుళివేల్ ఈ సినిమాని నిర్మిస్తుండగా సెల్వ అన్భరసన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్ర ఫస్ట్లుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ హీరోయిన్ మీరా మిధున్ గురించి తెలియచేసాడు. డైరెక్టర్ మాట్లాడుతూ.. చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తయిన తర్వాత హీరోయిన్ మీరా మిథున్ను ఏవో కారణాల వల్ల పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె జైలు నుంచి బయటకు రావడంతో మిగిలిన 20 శాతం షూటింగ్ను కొడైకెనాల్లో నిర్వహించామని తెలిపారు. అయితే 2రోజుల్లో షూటింగ్ పూర్తి అవుతుందనగా మీరా మిథున్ తనతో వచ్చిన మరో ఆరుగురు వ్యక్తులతో కలసి ఎవరికీ చెప్పకుండా పారిపోయిందని తెలిపారు. దీంతో చేసేదేమి లేక ఆమె లేకుండానే కథను అప్పటికప్పుడు మార్చి చిత్రాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.
Bigg Boss 5 : శ్రీరామ్ బిగ్బాస్ గెలుపు కోసం ఆటో తోలిన రవి
ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్ వర్గాల్లో చర్చాంశానీయం అవుతుంది. దీనిపై మీరా మిధున్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అసలు మీరా మిధున్ ఇంకా వెలుగులోకి వచ్చిందో లేదో కూడా తెలీదని చిత్ర యూనిట్ పేర్కొన్నారు.