Trisha : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకింది : త్రిష

త్రిష కరోనా బారిన పడినట్లు తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ''అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌.........

Trisha : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకింది : త్రిష

Trisha

Trisha :   పస్తుతం రోజు రోజుకి మళ్ళీ కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. రోజుకొకరు కరోనా బారిన పడుతున్నట్లు వాళ్ళ సోషల్ మీడియాల ద్వారా తెలియచేస్తున్నారు. వరుసగా మహేష్ బాబు, మంచు లక్ష్మి, థమన్, వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్… ఇలా చాలా మంది కరోనా బారిన పడుతుంటే సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలయింది. తాజాగా సీనియర్ హీరోయిన్ త్రిష కూడా కరోనా బారిన పడింది.

Sathyaraj : ‘కట్టప్ప’కి కరోనా.. ఆస్పత్రిలో చేరిక

త్రిష కరోనా బారిన పడినట్లు తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ”అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌ చెప్పే కొన్ని క్షణాల ముందు నాకు కరోనా సోకినట్లు తెలిసింది. కరోనా అన్ని లక్షణాలు నాకున్నాయి. నాకు ఆ వారం అంతా చాలా బాధ కలిగించింది. ప్రస్తుతానికి నేను కోలుకుంటున్నాను. వ్యాక్సిన్‌ వేయించుకున్నాను కాబట్టే ఈరోజు నేను బాగున్నాను. దయచేసి అందరూ వ్యాక్సిన్‌ తీసుకోండి, మాస్క్‌ ధరించండి. త్వరలోనే మళ్లీ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుని ఇంటికి తిరిగొస్తాను. నాకోసం ప్రార్థించిన బంధుమిత్రులకు, అభిమానులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపింది.