Sequel Movies : సీక్వెల్స్ లో మారిపోతున్న హీరోలు..

ఇప్పుడు రాబోయే కొన్ని క్రేజీ సీక్వెల్స్ లో హీరోలు మారిపోయారు. దాంతో ఆ సినిమాలన్నీ ఇంట్రెస్టింగ్ గా మారాయి.

Sequel Movies : సీక్వెల్స్ లో మారిపోతున్న హీరోలు..

Heros Changed in Sequel Movies

Heros :  సాధారణంగా సూపర్ హిట్ మూవీస్ సీక్వెల్స్(Sequels) లో ప్రీవియస్ పార్ట్ లో నటించిన హీరోలే కంటిన్యూ అవుతుంటారు. ఎన్ని భాగాలుగా తీసినా చాలా సినిమాల్లో అదే హీరోలు రిపీట్ అయ్యారు. అయితే ఇప్పుడు రాబోయే కొన్ని క్రేజీ సీక్వెల్స్ లో హీరోలు మారిపోయారు. దాంతో ఆ సినిమాలన్నీ ఇంట్రెస్టింగ్ గా మారాయి.

కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘డాన్’. అమితాబ్ డాన్ కు ఇది రీమేక్ వెర్షన్. ఆ తర్వాత దీనికి రెండో పార్ట్ తీయగా అది కూడా సూపర్ హిట్టయింది. ఈ రెండు సినిమాలకూ ఫర్హాన్ అఖ్తరే డైరెక్టర్. ఇప్పుడు డాన్ 3 తీసే ప్లానింగ్ లో ఉన్నాడు. స్క్రిప్ట్ ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ రీసెంట్ గా దానికో రూపం తీసుకొచ్చాడు ఫర్హాన్. అయితే మూడో పార్ట్ కు షారుఖ్ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదని సమాచారం. ఇప్పుడతని స్థానంలో రణ్వీర్ సింగ్ అయితే ఎలా ఉంటుందని ప్లాన్ చేస్తున్నాడు ఫర్హాన్.

కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ‘జిగర్తండా’ తమిళ మూవీ సూపర్ సక్సెస్ అయింది. బాబీ సింహా సిద్దార్ద్ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ కార్తిక్ సుబ్బరాజ్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. తొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోనే జిగార్తాండ డబల్ ఎక్స్ మూవీ తెరకెక్కుతోంది. అయితే రెండో పార్ట్ లో హీరోలు మారిపోయారు. రాఘవ లారెన్స్ ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా కనిపిస్తున్నాడు. ఎస్ జె సూర్య డైరెక్టర్ పాత్రని మూవీలో పోషిస్తున్నాడు. జిగార్తాండ తరహాలోనే ఈ స్టొరీని కూడా కార్తీక్ సుబ్బరాజ్ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ చిత్రం అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఆ సినిమా వచ్చి చాలా రోజులు అయినా దాని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కథ బాగుండటంతో పాటు సినిమాలోని యాక్టర్స్ అందరూ పోటీ పడి మరీ నటించారు. తెలుగు, తమిళ్ లో ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మూవీకి మళ్ళీ ఇన్నాళ్ళకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ పి.వాసునే దీనికి డైరెక్టర్. అయితే హీరో మాత్రం మారిపోయాడు. సెకండ్ పార్ట్ కోసం రజనీకాంత్ ప్లేస్ లోకి లారెన్స్ వచ్చి చేరాడు. అయితే ఈ సారి భయపెట్టే పనిని బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ భుజాన వేసుకుంది.

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కెరీర్ బెస్ట్ మూవీ ‘జెంటిల్‌మేన్’. శంకర్ డెబ్యూ మూవీగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో తెలుగు, తమిళ భాషల్లో దుమ్మురేపేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జెంటిల్‌ మేన్‌ 2’ రాబోతోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రొడ్యూసర్‌ కె.టి. కుంజుమోన్‌ ఎప్పుడో అనౌన్స్ చేశాడు. ప్రియాలాల్, నయనతార చక్రవర్తి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే రెండో పార్ట్ లో మాత్రం అర్జున్ హీరోగా కంటిన్యూ కావడం లేదు. ఆయన ప్లేస్ లో వేరే స్టార్ హీరోని ఎంపిక చేయబోతున్నారు.

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘రాక్షసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ అనే పేరుతో రీమేక్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్టైంది. లేటెస్ట్ గా ఈ సినిమాకి సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. దీనికి కావాల్సిన కథ కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇందులో ఎవరిని హీరోగా తీసుకోబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ నే హీరోగా అనుకున్నారు కానీ అతడు ఈ సినిమాలో నటించడం లేదు. ఇతడి ప్లేస్ లో ముందుగా మీడియం రేంజ్ హీరోలను అనుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం స్టార్ నటుడితో సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు.

Ajith Kumar : బైక్ పై స్టార్ హీరో అజిత్ వరల్డ్ టూర్.. మీరు కూడా వెల్దామనుకుంటున్నారా?

ఒక్కో సీక్వెల్ లో ఒక్కో హీరో నటించడం హిట్ సిరీస్ విషయంలో జరుగుతోంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ ఫస్ట్ కేస్ సూపర్ హిట్ అవడంతో ఈ సిరీస్ లో వరుసగా సినిమాలు తీయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అందులో భాగంగా హిట్ సెకండ్ కేస్ లో హీరోగా అడవి శేష్ వచ్చాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాకి మూడో సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సారి నేచురల్ స్టార్ నానీని రంగంలోకి దింపుతున్నారు. హిట్ థర్డ్ కేస్ మూవీలో నానీ ఎంట్రీని హిట్ సెకండ్ కేస్ క్లైమాక్స్ లోనే రివీల్ చేశారు. శైలేష్ కొలను డైరెక్షన్ లోనే మూడో భాగం తెరకెక్కబోతోంది. త్వరలోనే హిట్ 3 సెట్స్ పైకి వెళ్ళబోతోంది. దీనికి ఏడు భాగాలు ఉన్నాయని, ఏడుగురు హీరోలు నటిస్తారని డైరెక్టర్ ఇప్పటికే ప్రకటించాడు.