NTR : తారక్‌తో ఇండియన్ క్రికెటర్లు.. వైరల్ అవుతున్న ఫొటో

భారత క్రికెటర్స్ లో కొంతమంది హైదరాబాద్ లో ఎన్టీఆర్ ని కలిసి ఫోటోలు దిగారు. ఎన్టీఆర్ తో కొంత సమయం గడిపారు. దీంతో క్రికెటర్స్ అంతా కలిసి ఎన్టీఆర్ తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో................

NTR : తారక్‌తో ఇండియన్ క్రికెటర్లు.. వైరల్ అవుతున్న ఫొటో

Indian cricketers photo with NTR goes viral

NTR :  జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తారక్ నార్త్ లో, దేశమంతటా కూడా అభిమానులు ఏర్పడ్డారు. కొమురం భీముడో సాంగ్ లో తన హావభావాలతో హాలీవుడ్ ప్రేక్షకులని కూడా మెప్పించాడు. ఇక ఎన్టీఆర్ మన తెలుగు స్టేట్స్ లోనే కాదు వేరే రాష్ట్రాల్లో కనపడిన సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ప్రముఖులు కూడా ఎన్టీఆర్ ని కలవాలని కోరుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్స్ అయితే ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఎన్టీఆర్ తో భారత క్రికెటర్లు దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం టీమిండియా, న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. మొదట వన్డే సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా జనవరి18 (బుధవారం)న జరగనుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకుంది.

Prabhas : ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో మరో సినిమా.. నిజమేనా?

ఇటీవలే ఎన్టీఆర్ కూడా RRR టీంతో కలిసి అమెరికాలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకొని ఇండియాకి తిరిగి వచ్చారు. అయితే భారత క్రికెటర్స్ లో కొంతమంది హైదరాబాద్ లో ఎన్టీఆర్ ని కలిసి ఫోటోలు దిగారు. ఎన్టీఆర్ తో కొంత సమయం గడిపారు. దీంతో క్రికెటర్స్ అంతా కలిసి ఎన్టీఆర్ తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ తో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, శార్దుల్, శుభమాన్ గిల్‌తో పాటు మరికొంతమంది టీమిండియా సిబ్బంది కూడా ఉన్నారు. అయితే వీరంతా ఎక్కడ కలిశారు అనేది మాత్రం తెలుపలేదు. ఈ ఫొటో చూసి ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సూర్యకుమారి యాదవ్ ఎన్టీఆర్ తో సపరేట్ గా దిగిన ఫోటోని షేర్ చేసి.. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది బ్రదర్. RRR సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించినందుకు మరోసారి అభినందనలు అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.