Jammu Kashmir : శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ ఉగ్రవాది హతం

శ్రీనగర్‌లో భద్రతాబలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు

Jammu Kashmir : శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ ఉగ్రవాది హతం

Jammu Kashmir

Jammu Kashmir : సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత నిర్విరామంగా సాగుతుంది. ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ చేసుకొని భద్రతాబలగాలు మెరుపు దాడులు చేస్తున్నాయి. గత వారం రోజుల్లో సుమారు 8 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఇక ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున శ్రీనగర్ సమీపంలోని హార్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం రావడంతో స్థానిక పోలీసులతో కలిసి గాలింపు చేపట్టారు.

చదవండి : Encounter: ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

ఈ క్రమంలోనే టెర్రరిస్టులు భద్రతాబలగాలపై కాల్పులు జరపగా వెంటనే తేరుకొని ఎదురుకాల్పులు జరిపారు భద్రతా సిబ్బంది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం కాగా మరికొందరు పారిపోయినట్లు సమాచారం. చనిపోయిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందిన వాడో తెలియదని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

చదవండి : Srinagar Encounter : భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

చదవండి : Encounter: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతం